Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఏపీలో కూటమిదే అధికారం, కాంగ్రెస్ ఖాతా తెరుస్తుందట

pawan - babu

ఐవీఆర్

, మంగళవారం, 30 ఏప్రియల్ 2024 (20:08 IST)
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు మే 13న జరుగనున్నాయి. ఈ నేపధ్యంలో ఏ పార్టీ అధికారాన్ని చేజిక్కించుకుంటుందన్న దానిపై రైజ్ సంస్థ సర్వే వివరాలను వెల్లడించింది. ఈ సర్వేలో తెదేపా-జనసేన-భాజపా కూటమి స్పష్టమైన ఆధిక్యత సాధిస్తుందని తెలిపింది.
 
కూటమి 108 నుంచి 120 స్థానాల వరకూ విజయం సాధిస్తుంది. అధికార వైసిపికి ఈసారి ఎన్నికల్లో పరాజయం తప్పదన్నట్లు వున్నది. ఆ పార్టీకి కేవలం 41 నుంచి 54 స్థానాల వచ్చే పరిస్థితి వుంది. ఐతే 43 స్థానాల్లో హోరాహోరీ పోరు జరుగుతుందని తేలింది. ఆసక్తికరంగా పదేళ్ల తర్వాత ఏపీలో కాంగ్రెస్ పార్టీ ఒక్క స్థానంలో విజయం సాధించే అవకాశం వున్నదట. ఇకపోతే మొత్తం 25 లోక్ సభ స్థానాలకు గాను కూటమి 18 స్థానాల్లో విజయ బావుటా ఎగురువేస్తుందని సర్వే వెల్లడించింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తమ సరికొత్త డెజర్ట్ కలెక్షన్‌ను పరిచయం చేసిన చౌమాన్ హైదరాబాద్