Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

గరుడ సేవకు సర్వం సిద్ధం - తిరుమలకు చేరుకున్న 5 లక్షల మంది భక్తులు

శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో ప్రధాన ఘట్టమైన గరుడసేవకు సర్వం సిద్ధమైంది. రాత్రికి గరుడ వాహనంపై స్వామివారు ఊరేగనున్నారు. గరుత్మంతుడిపై స్వామివారిని దర్శించుకుంటే సర్వపాపాలు తొలగిపోతాయన్నది భక్తుల నమ్మకం. ప్రతి యేటా గరుడ వాహన సేవకు 5 లక్షల మంది భక్తులు తిర

గరుడ సేవకు సర్వం సిద్ధం - తిరుమలకు చేరుకున్న 5 లక్షల మంది భక్తులు
, సోమవారం, 17 సెప్టెంబరు 2018 (16:16 IST)
శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో ప్రధాన ఘట్టమైన గరుడసేవకు సర్వం సిద్ధమైంది. రాత్రికి గరుడ వాహనంపై స్వామివారు ఊరేగనున్నారు. గరుత్మంతుడిపై స్వామివారిని దర్శించుకుంటే సర్వపాపాలు తొలగిపోతాయన్నది భక్తుల నమ్మకం. ప్రతి యేటా గరుడ వాహన సేవకు 5 లక్షల మంది భక్తులు తిరుమలకు వస్తారు. ఈ యేడాది అదేవిధంగా 5 లక్షల మందికి పైగా భక్తులు తిరుమలకు చేరుకున్నారు.
 
తిరుమల భక్తజన సంద్రంగా మారిపోయింది. ఇసుకేస్తే రాలనంత జనంలా మారిపోయాయి తిరుమల గిరులు. ఏ మూలన చూసినా గోవింద నామస్మరణలే వినిపిస్తున్నాయి. గ్యాలరీలన్నీ ఇప్పటికే నిండిపోయాయి. మాడ వీధులన్నీ భక్తులతో కిటకిటలాడుతోంది. పరిమిత సంఖ్యలో మాత్రమే భక్తులను తిరుమలకు అనుమతిస్తున్నారు. ద్విచక్ర వాహనాలను పూర్తిగా తిరుమలకు నిలిపేశారు. కార్లు, బస్సులలో మాత్రమే తిరుమలకు భక్తులను అనుమతిస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్లేటులో దూబే కాళ్లు కడిగి.. ఆ నీటి తాగి తలపై చల్లుకున్నాడు..