Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఇంటికి పిలిచి కూల్ డ్రింక్‌లో మత్తు మందు కలిపి అత్యాచారం

విజయవాడ కొత్తపేట పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని టేనర్‌పేట అడ్డరోడ్డులో జరిగిన ఘటన సినిమా స్టోరీని తలపిస్తుంది. స్కూల్‌ గ్రౌండ్‌లో క్రికెట్‌ ఆడేందుకు పొట్నూరి లక్ష్మణ్‌ తన స్నేహితులతో కలిసి వచ్చేవాడు. గ్రౌండ్ సమీపంలో ఓ స్కూల్‌లో పనిచేస్తున్న 20 ఏళ్ల యువతి

ఇంటికి పిలిచి కూల్ డ్రింక్‌లో మత్తు మందు కలిపి అత్యాచారం
, శుక్రవారం, 13 జులై 2018 (13:53 IST)
విజయవాడ కొత్తపేట పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని టేనర్‌పేట అడ్డరోడ్డులో జరిగిన ఘటన సినిమా స్టోరీని తలపిస్తుంది. స్కూల్‌ గ్రౌండ్‌లో క్రికెట్‌ ఆడేందుకు పొట్నూరి లక్ష్మణ్‌ తన స్నేహితులతో కలిసి వచ్చేవాడు. గ్రౌండ్ సమీపంలో ఓ స్కూల్‌లో పనిచేస్తున్న 20 ఏళ్ల యువతి తన అన్నయ్యతో కలిసి ఉంటోంది. యువతి తల్లిదండ్రులు చిన్నతనంలోనే మరణించడంతో అన్నయ్యతో కలిసి ఉంటుంది. ఆమె అన్నయ్య మానసిక వికలాంగుడు. 
 
మానసిక పరిస్థితి సరిగా ఉండదు. దాంతో సదరు యువతిపై కన్నేసిన లక్ష్మణ్‌ పలుమార్లు మాటలు కలిపేందుకు ప్రయత్నించాడు. మంచివాడిగా నటించాడు. యువతి ఫోన్‌ నెంబర్‌ సంపాదించి ఫోన్‌ చేయడం, మెస్సేజ్‌లు పెట్టడం ప్రారంభించాడు. నమ్మకంగా ఉండటంతో లక్ష్మణ్‌తో యువతి మాట్లాడేది. ఒక రోజు ఆమెను తన ఇంటికి రావాలని, తల్లిదండ్రులకు పరిచయం చేస్తానని చెప్పి నమ్మించాడు. 
 
బైక్‌పై ఇంటికి తీసుకు వెళ్లగా... ఇంట్లో అందరూ బయటకు వెళ్లారని చెప్పి మత్తు మందు కలిపిన కూల్‌డ్రింక్‌ తాగించి ఆమెపై అత్యాచారం చేశాడు. అంతేకాదు అదంతా వీడియోలో బంధించాడు. అయితే రెండు నెలల కిందట యువతి పెళ్లి ప్రస్తావన తీసుకురావడంతో అప్పటి నుంచి లక్ష్మణ్‌ తప్పించుకుని తిరగడమే కాదు తన దగ్గిర వీడియోలు ఉన్నాయి.. అవన్నీ బయటపెడతానని బ్లాక్ మెయిల్ చేయడం మొదలు పెట్టాడు.. దీంతో బాధితురాలు గురువారం కొత్తపేట పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసిన పోలీసులు వెంటనే నిందితుడి కోసం వెతకటం ప్రారంభించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నమ్మించి తీసుకెళ్లి - మత్తుమందిచ్చి అత్యాచారం... ఎక్కడ?