Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఒక్క రైతుకు 50 మంది పోలీసుల రక్షణ... ఎక్కడ?

police protection a farmer
, మంగళవారం, 26 సెప్టెంబరు 2023 (09:33 IST)
మూడు రాజధానుల పేరుతో రాజధాని అమరావతిని విధ్వంసం చేసిన వైకాపా అధినేత, ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఆ ప్రాంత రైతులు అంటే హడలిపోతున్నారు. దీంతో తాను ప్రయాణించే మార్గంలో వందల, వేల సంఖ్యలో పోలీసులను రోడ్డుకు ఇరువైపులా మొహరించి, ఆ తర్వాత తన కాన్వాయ్ సురక్షితంగా వెళ్లేలా చర్యలు తీసుకుంటున్నారు. తాజాగా రోడ్డు పక్కన ఊత కర్రతో నిలబడివున్న ఓ రైతుకు కాపలాగా 50 మంది పోలీసులు ఉన్న ఫోటో ఇపుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. 
 
ఆ వృద్ధుడు సరిగ్గా నడవలేడు. చేతికర్ర లేనిదే అడుగు తీసివేయలేడు. అలాంటి రైతును చూసినా సీఎం జగన్‌కు హడల్. ఆ రైతు చుట్టూ 50 మంది పోలీసులు నిల్చొన్నారు. దీనికి కారణం.. ఆయన అమరావతి రైతు. ఆయన నిలబడిన చోటు దీక్షాశిబిరం. 50 మందికిపైగా పోలీసులు ఆ రైతు ముందు గోడలా నిలబడితే.. వెనుక నుంచి కార్ల కాన్వాయ్‌లో సీఎం జగన్ వెళ్లారు. 
 
రాజధానిని మూడు ముక్కలాట చేసి అమరావతికి కోసం భూములు ఇచ్చిన రైతులతో మాట్లాడలేక, వారి సమస్య పరిష్కరించలేక రాజకీయ క్రీడ ఆడుతున్న సీఎం ఇలా పోలీసుల మాటున దాటిపోతున్నారు. ఈ పరిస్థితి గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం మందడం దీక్షా శిబిరం వద్ద కనిపించింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పుంగనూరు అల్లర్లు కేసులో కుమారుడికి బెయిల్ రాలేదనీ...