Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

చిత్తూరులో పోలీసుకు పవర్ తుస్... వృద్ధుడు కూడా బాదేస్తాడంతే... (Video)

చిత్తూరులో పోలీసుకు పవర్ తుస్... వృద్ధుడు కూడా బాదేస్తాడంతే... (Video)
, మంగళవారం, 22 జనవరి 2019 (18:18 IST)
ఏపీలో పోలీసులకే రక్షణ లేకుండాపోయింది. సీఎం చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరులో టీడీపీ తమ్ముళ్లకు పోలీసులన్నా లెక్కలేకుండాపోయింది. జిల్లా టీడీపీ ఆఫీస్‌లో ఆపరేటర్‌గా పనిచేసే యుగంధర్‌ నాయుడు తండ్రి చంద్రశేఖర్ నాయుడు ఏకంగా నడిరోడ్డుపైనే కానిస్టేబుళ్లు కర్ర తీసుకుని చితకబాదాడు. పోలీసులైతే ఏం పీకుతార్రా... అంటూ కర్ర తీసుకుని పదేపదే కొట్టాడు. దీంతో కానిస్టేబుల్‌ తలకు గాయమైంది. 
 
ఈ దృశ్యాలను కొందరు మొబైల్‌లో చిత్రీకరించడంతో సంచలనంగా మారింది. జిల్లాలోని పెనుమూరు మండల కేంద్రంలో ఒక స్థల వివాదం కోర్టుకు చేరింది. ఆ స్థలంలో ఎవరూ పనులు చేపట్టవద్దని కోర్టు ఇటీవల ఆదేశాలు జారీ చేసింది. అయితే చంద్రశేఖర్‌ నాయుడు జేసీబీ సాయంతో స్థలంలో పనులు చేపట్టారు. 
 
ఈ విషయం తెలుసుకున్న స్థానిక ఎస్‌ఐ… పనులను అడ్డుకునేందుకు కానిస్టేబుల్‌ రమేష్‌ను పంపించాడు. అక్కడికి వెళ్లిన రమేష్ కోర్టు ఆదేశాలను చూపించి ఇక్కడ పనులు చేయడం నేరమని చెప్పే ప్రయత్నం చేశాడు. దీంతో చంద్రశేఖర్‌ నాయుడికి కోపం వచ్చింది. నీవు ఎవడ్రా నాకు చెప్పడానికి అంటూ కర్ర తీసుకుని మహిళల సమక్షంలోనే కానిస్టేబుల్‌ను చితకబాదాడు. చూడండి వీడియో... 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

'నడిచే దేవుడు' అంత్యక్రియలు పూర్తి...