Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఎమ్మెల్యే కిడారి హత్యపై చంద్రబాబు కామెంట్స్...

అరకు సిట్టింగ్ ఎమ్మెల్యే కిడారు సర్వేశ్వర రావును మావోయిస్టులు కాల్చివేసిన ఘటనపై ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తంచేశారు. అమెరికా పర్యటనలో ఉన్న సీఎంకు అధికారుల

ఎమ్మెల్యే కిడారి హత్యపై చంద్రబాబు కామెంట్స్...
, ఆదివారం, 23 సెప్టెంబరు 2018 (15:09 IST)
అరకు సిట్టింగ్ ఎమ్మెల్యే కిడారు సర్వేశ్వర రావును మావోయిస్టులు కాల్చివేసిన ఘటనపై ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తంచేశారు. అమెరికా పర్యటనలో ఉన్న సీఎంకు అధికారులు ఈ విషయాన్ని చేరవేశారు. అరకు ఏజెన్సీలో మావోయిస్టులు జరిపిన కాల్పులను ఆయన తీవ్రంగా ఖండించారు. దాడులు, హత్యలు మానవత్వానికే మాయనిమచ్చని, ప్రజాస్వామ్యవాదులు అందరూ ఈ దాడిని ఖండించాలని కోరారు.
 
వెనుకబడిన ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనుల అభ్యున్నతికి కిడారి చేసిన సేవలను కొనియాడారు. ఎమ్మెల్యే కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలిపారు. డుంబ్రీగూడ మండలం లిపిట్టిపుట్టు వద్ద బసులో వెళుతున్న కిడారిపై మావోయిస్టులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఆయన ప్రాణాలు కోల్పోయారు. 
 
దీంతో తీవ్ర గాయాలతో ఘటనాస్థలంలోనే సర్వేశ్వరరావు కన్నుమూశారు. 2014 ఎన్నికల్లో వైసీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన కిడారి కొన్ని నెలల క్రితం తెలుగుదేశం పార్టీలో చేరారు. ప్రస్తుతం ఆయన ప్రభుత్వ విప్‌గా కూడా ఉన్నారు. నిజానికి మావోయిస్టులు హిట్‌ లిస్టులో ఉన్న కిడారికి హెచ్చరికలు జారీ చేస్తూ గతంలో పోస్టర్లు వెలిశాయి. తన క్వారీ మైనింగ్‌ వద్దకు వెళ్తున్న సమయంలో కిడారి, ఆయన అనుచరులపై మావోయిస్టులు మాటువేసి దాడి చేశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

గుడికెళ్లిన వికలాంగురాలిని కొంగుపట్టుకుని లాగిన కామాంధుడు