Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మంత్రి జోగి రమేష్‌కు షాకిచ్చిన బామ్మర్దులు... టీడీపీ తీర్థం!!

jogi ramesh

వరుణ్

, శుక్రవారం, 19 ఏప్రియల్ 2024 (17:21 IST)
వైకాపా నేత, మంత్రి జోగి రమేష్‌కు ఆయన సొంత కుటుంబ సభ్యులు తేరుకోలేని షాకిచ్చిచారు. తాను పోటీ చేస్తున్న నియోజకవర్గం మైలవరంలో జోగి రమేష్ ఎన్నికల ప్రచారంలో నిమగ్నమైవుండగా, ఆయన బంధువులు మాత్రం గుట్టుచప్పుడు కాకుండా టీడీపీలో చేరారు. ఏపీలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో అన్ని పార్టీల నేతలు నిమగ్నమైవున్నారు. గురువారం నుంచి నామినేషన్లు ప్రక్రియ కూడా ప్రారంభమైంది. ఎన్నికలకు సమయం ముంచుకొస్తున్న తరుణంలో పార్టీలు మారుతున్న వారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంటుంది. తాజాగా మంత్రి జోగి రమేష్‍‌కు కూడా ఇలాంటి చేదు అనుభవమే ఎదురైంది. సాక్షాత్తూ సొంత బామ్మర్దులు, బంధువులు వైకాపాకు టాటా చెప్పేశారు. వారు సైకిల్ ఎక్కేశారు. 
 
మైలవరం టీడీపీ అభ్యర్థి వసంత కృష్ణప్రసాద్ సమక్షంలో పసుపు కండువా కప్పుకున్నారు. శుక్రవారం ఉదయం మంత్రి జోగి రమేష్‌కు షాకిస్తూ, ఆయన సొంత బామ్మర్దులు పామర్తి దుర్గా ప్రసాద్, పామర్తి దుర్గారావు, పామర్తి వెంకటేశ్వర రావులు టీడీపీ చేరారు. వీరితో పాటు జోగి రమేశ్‌‍కు చెందిన 40 మంది బంధువర్గం కూడా టీడీపీ తీర్థం పుచ్చుకుంది. ఇబ్రహీంపట్నంలో జోగి రమేష్ ఇంటి ముందు సభా వేదికను ఏర్పాటు చేసి మరీ వీళ్లంతా టీడీపీలో చేరారు. అయితే, ఈ అంశంపై మంత్రి జోగి రమేష్ స్పందించాల్సివుంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

డెల్ టెక్నాలజీస్ ఏఐ పవర్డ్ ల్యాప్‌టాప్‌లు.. ధర రూ.1,10,999