Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తనపై వ్యక్తిగత విమర్శలు చేసే వైకాపా నేతలకు వైఎస్ షర్మిల సవాల్...

ys sharmila

ఠాగూర్

, మంగళవారం, 13 ఫిబ్రవరి 2024 (14:16 IST)
మహానేత వైఎస్ఆర్ 52 వేల పోస్టులతో మెగా డీఎస్సీ వేస్తే ఆయన వారసుడిగా చెప్పుకునే ఏపీ ముఖ్యమంత్రి, వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి కేవలం ఆరు వేల పోస్టులతో దగా డీఎస్సీ వేశారని, దీన్ని ప్రశ్నిస్తే తనపై వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారని వైకాపా అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆరోపించారు. దగా డీఎస్సీని అడ్డుపెట్టుకుని తనపై విమర్శలు గుప్పించే వైకాపా నేతలకు, వీళ్లను మోసే సోషల్ మీడియాకు ఆమె ఒక సవాల్ విసిరారు. తాను అడిగిన ప్రశ్నలకు వైకాపా నేతలు, వారి సోషల్ మీడియా సమాధానాలు ఇవ్వాలని ఆమె డిమాండ్ చేశారు. 
 
1. 2019 ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లు 25 వేల టీచర్ పోస్టుల భర్తీ ఎక్కడ? 
2. 5 ఏళ్లు నోటిఫికేషన్ ఇవ్వకుండా కాలయాపన ఎందుకు చేశారు? 
3. ఎన్నికలకు నెలన్నరముందు 6 వేల పోస్టుల భర్తీ చేయడంలో ఆంతర్యం ఏమిటి? 
4. టెట్, డీఎస్సీ కలిపి నోటిఫికేషన్ ఇస్తే అభ్యర్థులు దేనికి ప్రిపేర్ అవ్వాలి? 
5. నోటిఫికేషన్ ఇచ్చిన 30 రోజుల్లో పరీక్షలు పెట్టడం దేశంలో ఎక్కడైనా ఉందా? టెట్‌కి 20 రోజులు, తర్వాత డీఎస్సీ మద్య కేవలం 6 రోజుల వ్యవధినా? 
6. వైఎస్ఆర్ హయాంలో 100 రోజుల గడువు ఇచ్చిన సంగతి వారసుడు జగన్‌కి గుర్తులేదా? 
7. ఇచ్చిన సిలబస్ ప్రకారం ఒక్కో అభ్యర్థి 150 పుస్తకాలు చదవాలని మీకు తెలియదా? 
8. రోజుకి 5 పుస్తకాలు చదవడం అభ్యర్థులకు సాధ్యపడేపనేనా? 
9. మానసిక ఒత్తిడికి గురిచేసి నిరుద్యోగులను పొట్టన పెట్టుకోవాలని కుట్ర చేస్తున్నారా? ఇది కక్ష్య సాధింపు చర్య కాదా? 
10. నవ రత్నాలు, జాతి రత్నాలు అని చెప్పుకొనే జగన్ ఆన్న, ఆయన చుట్టూ ఉండే సకల శాఖ మంత్రులు ఈ 9 ప్రశ్నలకు దమ్ముంటే సమాధానం చెప్పాలి? 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రామాయణ మహాభారతాలు ఊహాజనితాలు... : టీచర్‌పై వేటు