Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అది జరిగితే అయోధ్య స్థలంలోనే మసీదును నిర్మిస్తాం: ఓవైసీ

అయోధ్యపై ఎంఐఎం అధినేత అసదుద్ధీన్ ఓవైసీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అయోధ్య వివాదంలో సుప్రీం కోర్టు తీర్పు ఆధారంగానే వుంటుందని ఓవైసీ నమ్మకం వ్యక్తం చేశారు. అయోధ్య వివాదాస్పద స్థలంలోనే బాబ్రీ మసీదు నిర్

అది జరిగితే అయోధ్య స్థలంలోనే మసీదును నిర్మిస్తాం: ఓవైసీ
, ఆదివారం, 25 ఫిబ్రవరి 2018 (13:57 IST)
అయోధ్యపై ఎంఐఎం అధినేత అసదుద్ధీన్ ఓవైసీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అయోధ్య వివాదంలో సుప్రీం కోర్టు తీర్పు ఆధారంగానే వుంటుందని ఓవైసీ నమ్మకం వ్యక్తం చేశారు. అయోధ్య వివాదాస్పద స్థలంలోనే బాబ్రీ మసీదు నిర్మాణానికి కట్టుబడి వున్నట్లు తెలిపారు.

మా మసీదు అక్కడే వుండదేని.. దేవుడి అనుగ్రహం ఉంటే.. సుప్రీం కోర్టు తీర్పు మాకు అనుకూలంగా వస్తే.. అదే స్థలంలో మరోసారి మసీదు నిర్మిస్తామని ఓవైసీ చెప్పారు. తీర్పు వాస్తవాల ఆధారంగా వుంటుందని.. మత విశ్వాసాల ఆధారంగా కాదనే నమ్మకం ఉందని ఓవైసీ తెలిపారు. 
 
భారత్‌లో ముస్లింలు రెండో తరగతి ప్రజలుగా మారిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. మమ్మల్ని భయపెట్టాలనుకుంటున్నవారు.. ఆస్థలాన్ని విడిచి వెళ్లాలని తమకు వ్యతిరేకంగా గళమెత్తుతున్నవారికి చెప్తున్నది.. ఏంటంటే.. మసీదును తాము వదిలిపెట్టేది లేదని ఓవైసీ తెలిపారు.

తమను పాకిస్థానీ అనే వారిని ప్రశ్నించేది ఒక్కటేనని.. హర్షదే మెహతా.. కేతన్ పరేఖ్, నీరవ్ మోదీ ముస్లింలా అని ఓవైసీ అడిగారు. వీరు మన ప్రధానిని భాయ్ అంటూనే దేశాన్ని దోచుకున్నారని ఓవైసీ తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కర్నూలును రెండో రాజధానిగా చేయండి : బీజేపీ నేతల డిమాండ్