Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

హైదరాబాదుకు ఇంటర్య్వూకని వచ్చిన భీమవరం మహిళ అదృశ్యం

ఇంటర్య్వూకు వచ్చిన ఓ మహిళ అదృశ్యమైన ఘటన ఉప్పల్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో జరిగింది. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని రామచంద్రాపురానికి చెందిన నరేష్‌ వర్మ భార్య ఎం.శ్రావణి (24) ఈ నెల 1వతేదీన నగరంలో ఉద్య

హైదరాబాదుకు ఇంటర్య్వూకని వచ్చిన భీమవరం మహిళ అదృశ్యం
, బుధవారం, 16 మే 2018 (12:57 IST)
ఇంటర్య్వూకు వచ్చిన ఓ మహిళ అదృశ్యమైన ఘటన ఉప్పల్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో జరిగింది. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని రామచంద్రాపురానికి చెందిన నరేష్‌ వర్మ భార్య ఎం.శ్రావణి (24) ఈ నెల 1వతేదీన నగరంలో ఉద్యోగం కోసం ఇంటర్వ్యూకు వచ్చింది. ఇంటర్వ్యూ తర్వాత ఉప్పల్‌లో ఉండే స్నేహితురాలి ఇంటికి వెళ్లింది. 
 
మరుసటిరోజు భీమవరం వెళ్లేందుకు శ్రావణిని ఆమె స్నేహితురాలు ఉప్పల్‌ రింగురోడ్డులో దింపేసి వెళ్లింది. ఆ తర్వాత శ్రావణి ఇంటికి చేరుకోలేదు. సెల్‌ఫోన్‌ సైతం స్విచ్ఛాప్‌ చేసి ఉంది. ఆచూకీ లభించకపోవడంతో శ్రావణి సోదరుడు సత్యనారాయణరాజు మంగళవారం ఉప్పల్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బీజేపీకి షాకిచ్చిన రేవణ్ణ.. కర్ణాటక సీఎం కుమారస్వామినే...