Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఏపీలో తెలిసో తెలియకో ఓ పిచ్చిమొక్కను నాటాం ... ప్రజలే విజ్ఞతతో నిర్ణయం తీసుకోవాలి..

kamineni srinivas

వరుణ్

, మంగళవారం, 16 జనవరి 2024 (14:34 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నాలుగున్నరేళ్ల క్రితం తెలిసో తేలియకో ఓ పిచ్చి మొక్కను నాటామని, వచ్చే ఎన్నికల్లో ప్రజలే విజ్ఞతతో ఓ మంచి నిర్ణయం తీసుకోవాలని మాజీ మంత్రి, బీజేపీ నేత కామినేని శ్రీనివాస్ అన్నారు. మంగళవారం తెనాలిలో దివంగత నేత, మాజీ మంత్రి యడ్లపాటి వెంకట్రావు నివాసంలో జనసేన పీఏసీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌తో కలిసి ఆయన అల్పాహారం చేశారు. 
 
ఆ తర్వాత ఆయన విలేకరులతో మాట్లాడుతూ, తమది రాజకీయ భేటీ కాదన్నారు. కేవలం ఆత్మీయ సమావేశం మాత్రమేనని చెప్పారు. ఎవరు ఎక్కడ పోటీ చేయాలనే విషయం భారతీయ జనతా పార్టీ, జనసేన, తెలుగుదేశం పార్టీకి చెందిన ముఖ్య నేతలు చూసుకుంటారని చెప్పారు. 
 
రాష్ట్రంలో అనేక అరాచకాలు జరుగుతున్నాయని విమర్శించారు. కరెంటు, పెట్రోలు, నిత్యావసరాల ధరలు పెంచిన ప్రభుత్వం.. రోడ్లు, మౌలిక సదుపాయాల కల్పనలో విఫలమైందని ఆరోపించారు. ప్రజలు తమవంతు పాత్ర పోషించాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. 
 
పువ్వులంటే ఇష్టం.. కానీ నా శరీరానికి వీటి వల్ల ఎనర్జీ : హీరోయిన్ సమంత
 
పువ్వులంటే తనకు అమితమైన ఇష్టమని తన శరీరానికి వీటివల్ల ఎలర్జీ హీరోయిన్‌కు సమంత అన్నారు. నటనకు విరామం ప్రకటించి ఆరోగ్యంపై పూర్తి శ్రద్ధ పెట్టారు. సోషల్‌ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే ఆమె తాజాగా ఓ అందమైన ఫొటోను షేర్‌ చేశారు. పువ్వుల బొకే అందుకుంటున్నట్లు ఉన్న చిత్రాన్ని పంచుకున్న సమంత.. వాటిని తాకాలంటే భయమేస్తోందని పేర్కొన్నారు.
 
'ఇలాంటి బొకేలు చూసినప్పుడు మిశ్రమ భావనలు కలుగుతాయి. ఎందుకంటే నేను పువ్వులను ఇష్టపడతాను. కానీ నా శరీరానికి వీటి వల్ల ఎలర్జీ వస్తుంది. గతంలో ఈ పువ్వుల కారణంగానే నేను ఎమర్జెన్సీ రూమ్‌కు వెళ్లాల్సొచ్చింది. అందుకే వీటిని చూస్తే భయమేస్తుంది' అని రాశారు. ఇది వైరల్‌గా మారడంతో దీన్ని చూసిన వారంతా ఇందులో సమంత చాలా క్యూట్‌గా ఉన్నారంటూ కామెంట్స్‌ చేస్తున్నారు.
 
గతేడాది 'ఖుషి'తో అలరించిన సమంత త్వరలో 'సిటాడెల్‌' (ఇండియన్‌ వెర్షన్‌) వెబ్‌సిరీస్‌తో సందడి చేయనున్నారు. బాలీవుడ్‌ నటుడు వరుణ్‌ ధావన్‌ మరో కీలక పాత్రధారి. రాజ్‌, డీకే దర్శకత్వం వహించారు. మరోవైపు, సమంత కొన్ని రోజుల క్రితం నిర్మాతగానూ మారిన సంగతి తెలిసిందే. 'ట్రా లా లా మూవింగ్‌ పిక్చర్స్‌' పేరుతో నిర్మాణ సంస్థను ప్రారంభించినట్లు సోషల్‌ మీడియా వేదికగా ప్రకటించారు. 
 
కొత్త ప్రతిభను ప్రోత్సాహిస్తూ.. అర్థవంతమైన, ప్రామాణికమైన, విశ్వజనీనమైన కథల్ని ఈ వేదికపై నిర్మించనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఆమెకు సంబంధించిన మరో వార్త కూడా సోషల్ మీడియాలో జోరుగా ప్రచారమవుతోంది. అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘పుష్ప2’లో ఆమె మరోసారి ఐటెమ్‌ సాంగ్‌ చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనిపై చిత్రబృందం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.  

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చంద్రబాబు స్కిల్ కేసు క్వాష్ పిటిషన్‌పై సుప్రీంకోర్టు కీలక తీర్పు