Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆ చిన్నారి మృత్యుంజయుడు.. బతికి బట్టకట్టాడు..!

ఏదైనా ప్రమాదం జరిగి ప్రాణాలతో బయటపడితే మన పెద్దవారు.. అబ్బ.. ఇతడికి భూమ్మీద నూకలున్నాయని చెబుతుంటారు. 20 అడుగుల బోరుబావిలో పడిపోయిన ఆ చిన్నారి చివరకు మృత్యుంజయుడయ్యాడు. 11 గంటల పాటు బోరుబావిలోనే ఉన్న చిన్నారిని క్షేమంగా బయటకు తీశారు. ఈమధ్య కాలంలో బోర

ఆ చిన్నారి మృత్యుంజయుడు.. బతికి బట్టకట్టాడు..!
, బుధవారం, 16 ఆగస్టు 2017 (18:49 IST)
ఏదైనా ప్రమాదం జరిగి ప్రాణాలతో బయటపడితే మన పెద్దవారు.. అబ్బ.. ఇతడికి భూమ్మీద నూకలున్నాయని చెబుతుంటారు. 20 అడుగుల బోరుబావిలో పడిపోయిన ఆ చిన్నారి చివరకు మృత్యుంజయుడయ్యాడు. 11 గంటల పాటు బోరుబావిలోనే ఉన్న చిన్నారిని క్షేమంగా బయటకు తీశారు. ఈమధ్య కాలంలో బోరుబావిలో పడిన చిన్నారులను ప్రాణాలతో బయటకు తీయడం ఇదే ప్రధమమని అందరూ భావిస్తున్నారు.
 
గుంటూరు జిల్లా వినుకొండ మండలం ఉమ్మడివరంకు చెందిన మల్లిఖార్జున్, అనూషల కుమారుడు రెండేళ్ళ చంద్రశేఖర్ నిన్న ఇంటిలో ఆడుకుంటూ బయటకు వచ్చి ప్రమాదవశాత్తు బోరుబావిలో పడిపోయాడు. చిన్నారి కోసం పోలీసులు, ఫైర్ సిబ్బంది, ఎన్డీఆర్ ఎఫ్‌ బృందం తీవ్రంగా శ్రమించింది. ప్రాణాలతో బయటకు తీసేందుకు యత్నించింది. 11 గంటల పాటు శ్రమించి బోరుబావికి ఎదురుగా మరో గుంతను త్రవ్వి క్షేమంగా బయటకు తీసింది. తెల్లవారు జామున 2.30 గంటలకు చిన్నారిని క్షేమంగా బయటకు తీశారు.
 
చిన్నారి బయటకు రావడంతో తల్లిదండ్రులతో పాటు గ్రామస్తులు ఆనందంలో మునిగిపోయారు. గత కొన్నినెలలుగా బోరుబావిలో పడిన చిన్నారులను ఎంత ప్రయత్నించినా క్షేమంగా బయటకు తీయలేకపోయారు. కానీ చంద్రశేఖర్‌ను మాత్రం ప్రాణాలతో బయటకు తీయడంతో తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మహిళలు కనబడితే ముద్దులు, కడుపులు చేయమంటాడు బాలయ్య... రోజా సెటైర్లు