Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఏటీఎంలోకి ఎద్దు.. పరుగులు తీసిన కస్టమర్లు.. ఎక్కడో తెలుసా?

ఏటీఎంలోకి సాధారణంగా డబ్బు తీసుకునేందుకు కస్టమర్లు వెళ్తూ వుంటారు. అయితే ఈసారి ఏటీఎంలోకి కస్టమర్లు కాకుండా బుల్ వచ్చింది. ఎక్కడెక్కడో తిరిగి అలిసిపోయిన ఆ వృషభం.. ఏటీఎంలోని ఏసీ హాయిగా కూర్చుని సేదతీరింద

ఏటీఎంలోకి ఎద్దు.. పరుగులు తీసిన కస్టమర్లు.. ఎక్కడో తెలుసా?
, సోమవారం, 6 ఆగస్టు 2018 (09:48 IST)
ఏటీఎంలోకి సాధారణంగా డబ్బు తీసుకునేందుకు కస్టమర్లు వెళ్తూ వుంటారు. అయితే ఈసారి ఏటీఎంలోకి కస్టమర్లు కాకుండా బుల్ వచ్చింది. ఎక్కడెక్కడో తిరిగి అలిసిపోయిన ఆ వృషభం.. ఏటీఎంలోని ఏసీ హాయిగా కూర్చుని సేదతీరింది. ఈ ఘటన అనంతపురం జిల్లా పామిడిలో కనిపించింది. ఓ ఏటీఎం వద్ద సెక్యూరిటీగా ఎవరూ లేకపోవడం, తలుపు తీసుండటంతో ఆ ఎద్దు హాయిగా లోనికి వచ్చి పడకేసింది.
 
ఆ సమయంలో డబ్బులు తీసుకునేందుకు వచ్చిన చాలామంది ఎద్దును చూసి పారిపోయారు. మరో ఏటీఎంను వెతుక్కుంటూ వెళ్లి డబ్బు తీసేసుకున్నారు. మరికొందరు.. ఎద్దు ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పెట్టారు. ఏటీఎంలను ఇంత నిర్లక్ష్యంగా ఎలా నిర్వహిస్తున్నారని పలువురు విమర్శిస్తున్నారు. ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మాజీ ఎమ్మెల్యే గండ్ర అలాంటివారా? ఆమెను శారీరకంగా వాడుకుని వదిలేశారా...