Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

శ్రీవారిని దర్శించుకున్న ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి

jagan
, మంగళవారం, 19 సెప్టెంబరు 2023 (09:32 IST)
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఏపీ సీఎం జగన్‌కు అర్చకులు స్వాగతం ఇచ్చారు. సీఎంకు వేద మంత్రోచ్ఛారణలు, సంగీత వాయిద్యాలు వాయిస్తూ ఆలయంలోకి తీసుకెళ్లారు
 
పూజల అనంతరం రంగనాయకుల మండపంలో వేదాశీర్వచనం స్వీకరించి టీటీడీ చైర్మన్ కరుణాకరరెడ్డి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ పర్యటనలో డిప్యూటీ సీఎం నారాయణ స్వామి, మంత్రులు రామచంద్రారెడ్డి, రోజా, టీటీడీ కార్యనిర్వహణాధికారి ఏవీ ధర్మారెడ్డి, ఇతర రాష్ట్ర, జిల్లా ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
 
మరోవైపు ఈ ఏడాది తిరుమల బ్రహ్మోత్సవాల ప్రారంభం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరపున జగన్ మోహన్ రెడ్డి సోమవారం ఏడుకొండల స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు. తొమ్మిది రోజుల పాటు జరిగే బ్రహ్మోత్సవాల కోసం పట్టుబట్టలను సమర్పించడం ఆనవాయితీ.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తిరుపతి జిల్లాలో కలుషిత ఆహారం తిని 50 మందికి అస్వస్థత