Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

దండుపాళ్యం బ్యాచ్... 4 నెలలు భరిద్దాం, అందుకే తెదేపాతో కలిసి పోటీ: పవన్ కల్యాణ్

pawan kalyan
, శుక్రవారం, 24 నవంబరు 2023 (21:59 IST)
విశాఖ హార్బరులో అగ్నిప్రమాదానికి దగ్ధమైన బోటు యజమానులైన మత్స్యకారులకు, వారి కుటుంబాలను జనసేన అధినేత పవన్ కల్యాణ్ పరామర్శించారు. అనంతరం బోట్లు నష్టపోయిన బాధితులకు ఒక్కొక్కరికి రూ. 50,000 చొప్పున ఆర్థిక సాయం అందించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మత్స్యకారులతో మాట్లాడారు.
 
''నేను ఇచ్చిన డబ్బు పూర్తిగా బాధితులకు జరిగిన నష్టాన్ని తీర్చగలను అని నేను అనను. కానీ కష్టం వస్తే ఆదుకునేందుకు మీకోసం జనసేన వుంది, వీరమహిళలు వున్నారు, పవన్ కళ్యాణ్ వున్నాడు. నేను బుక్ చేసుకున్న విమానాన్ని బెదిరించి వెనక్కి పంపేశారు. నేను వస్తున్నాను అంటే వైసిపి నాయకులు ఎందుకు అంత భయపడుతున్నారు. ఆంధ్రలో అడుగుపెడుతున్నానంటే చాలు విమానాలు ఆపుతారు, రోడ్డుపైన రాకుండా దిగ్బంధిస్తారు. నేను వస్తున్నానంటే ఎందుకు అంత భయం?
 
దండుపాళ్యం బ్యాచ్‌లా తయారైంది. వైసీపీ రౌడీ మూకలు తయారయ్యారు. మనం అధికారంలోకి వచ్చాక ఇక్కడ మెరైన్ పోలీసింగ్ ఏర్పాటు చేస్తాం, చీకటిగా ఉంది, ఇక్కడ ఫ్లడ్ లైట్లను ఏర్పాటు చేస్తాం, ఆడవారు అర్థరాత్రి ధైర్యంగా తిరిగే పరిస్థితులు తీసుకొస్తాం. వైసీపీని ఓడించడానికి ఛాన్స్ తీసుకోదలచుకొలేదు. అందుకే టీడీపితో పొత్తు పెట్టుకున్నాము, రేపటి రోజున 5 వేల తేడాతో సీట్ ఓడిపోకూడదు, గెలిస్తే 25 వేల మెజారిటీతో గెలవాలి." అని విశాఖ మత్స్యకారులతో పవన్ కళ్యాణ్ అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బీఆర్‌ఎస్‌కు గట్టి ఎదురుదెబ్బ- కాంగ్రెస్‌లో చేరిన డాక్టర్ అబ్రహం