Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

డాడీ... మిఠాయిలు కొనిస్తానని తోటలోకి తీసుకెళ్లి ముద్దులు పెట్టాడు...

ఓ కామాంధుడు ఏడేళ్ళ బాలికపై లైంగికదాడికి పాల్పడ్డాడు. అదీ కూడా మిఠాయిలు కొనిచ్చి ఈ దారుణానికి ఒడిగట్టాడు. ఆ కామాంధుడు ఎవరో కాదు.. కన్నతండ్రి. గుంటూరు జిల్లా తాడికొండలో జరిగిన ఈ వివరాలను పరిశీలిస్తే...

డాడీ... మిఠాయిలు కొనిస్తానని తోటలోకి తీసుకెళ్లి ముద్దులు పెట్టాడు...
, బుధవారం, 12 సెప్టెంబరు 2018 (16:23 IST)
ఓ కామాంధుడు ఏడేళ్ళ బాలికపై లైంగికదాడికి పాల్పడ్డాడు. అదీ కూడా మిఠాయిలు కొనిచ్చి ఈ దారుణానికి ఒడిగట్టాడు. ఆ కామాంధుడు ఎవరో కాదు.. కన్నతండ్రి. గుంటూరు జిల్లా తాడికొండలో జరిగిన ఈ వివరాలను పరిశీలిస్తే...
 
తాడికొండ గ్రామానికి చెందిన షేక్‌ నాగుల్‌ బీ అనే మహిళకు 7 సంవత్సరాల క్రితం గుంటూరు లక్ష్మీనారాయణపురానికి చెందిన షేక్‌ రహ్మల్‌ అనే వ్యక్తితో వివాహమైంది. అతనికి అప్పటికే ఒక వివాహం జరిగి భార్య మరణించగా మరో మహిళను పెళ్లి చేసుకున్నాడు. ముగ్గురు సంతానం. వీరిలో ఇద్దరు ఆడ పిల్లలు ఉన్నారు. సైకో మనస్తత్వంతో కూడిన భర్త.. ఆది నుంచి ఇబ్బందులకు గురిచేస్తుండటంతో ఠాణాలో నాగుల్ బీ కేసు పెట్టి భర్తకు దూరంగా ఉంటోంది.
 
అయితే, ఇటీవల భార్యతో కాపురం చేసేందుకు వచ్చిన రహ్మల్‌ రెండు నెలలుగా తాడికొండలోనే ఉంటున్నాడు. ఈ నెల మూడో తేదీన పాఠశాల నుంచి వచ్చిన పెద్ద కుమార్తె (7)ను మిఠాయిలు కొనిపిస్తానంటూ బయటకు తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. అదేరోజు గుంటూరుకు వెళ్లిపోయిన భర్త ఇంటికి తిరిగిరాలేదు. మరుసటి రోజు పాఠశాల నుంచి వచ్చిన కుమార్తె కడుపు నొప్పి అంటూ బాధపడుతుంటే వేడి చేసి ఉంటుందని భావించిన తల్లి అంతగా పట్టించుకోలేదు. 
 
తరచూ నడుము నొప్పి, కడుపు నొప్పి అంటుండటంతో 10న గుంటూరు జీజీహెచ్‌కు తీసుకెళ్లిన తల్లికి వైద్యులు బాలికపై లైంగిక దాడికి గురైందని చెప్పడంతో విస్తుపోయింది. ఆ తర్వాత ఆస్పత్రికి తీసుకెళ్లి తనిఖీ చేయగా, అసలు విషయం తెలిసింది. దీంతో నిందితుడిపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బీజేపీ మినీ కాంగ్రెస్.. ముస్లింలకు మోడీ వకాల్తాదారు : తొగాడియా నిప్పులు