Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రాజంపేట నుంచి బీజేపీ ఎంపీ అభ్యర్థిగా మాజీ సీఎం నల్లారి

nallari kiran kumar reddy

సెల్వి

, శనివారం, 24 ఫిబ్రవరి 2024 (11:56 IST)
టీడీపీ, జనసేనల మధ్య సంకీర్ణం, బీజేపీ కూడా ఎప్పుడైనా ఆ కూటమిలో చేరే అవకాశం వుంది.  ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలలో దశాబ్ద కాలంగా క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉన్న సీనియర్ నేతలు వచ్చే ఎన్నికలకు ముందు మళ్లీ రాజకీయాల్లోకి రీ ఎంట్రీ ఇస్తున్నారు.
 
రాజంపేట నుంచి బీజేపీ ఎంపీ అభ్యర్థిగా బీజేపీ నేత, మాజీ సీఎం నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి బరిలోకి దిగే అవకాశం ఉంది. సార్వత్రిక ఎన్నికల్లో కూడా నల్లారి గెలుపు ఖాయమని చెబుతున్నారు. అయితే రాజంపేటలో నల్లారి పోటీకి దిగే అవకాశం ఉన్న పక్షంలో ఆయన తన ప్రత్యర్థి, వైసీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి నుంచి గట్టిపోటీని ఎదుర్కోవాల్సి ఉంటుంది.
 
రాజంపేట ఎంపీపీ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌గా సుగవాసి సుబ్రహ్మణ్యంను టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రకటించిన సంగతి తెలిసిందే. జనసేన అభ్యర్థులు కూడా తమకే సీటు కేటాయిస్తారనే ఆశతో నియోజకవర్గంలో ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. నల్లారి ఆకస్మిక ప్రవేశంతో రెండు అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్‌ఛార్జ్‌లలో మార్పు వచ్చే అవకాశం ఉంది.
 
 మరో 10 పార్లమెంట్ నియోజకవర్గాల్లో కూడా ఇదే పరిస్థితి నెలకొనే అవకాశం ఉంది. మరి ఈ పరిస్థితిని పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు ఎలా ఎదుర్కొంటారో చూడాలి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఎయిర్‌టెల్ ఇన్-ఫ్లైట్ రోమింగ్ డేటా ప్లాన్స్.. రూ.195 నుంచి ప్రారంభం