Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మిర్యాలగూడలో పరువు హత్య.. కమ్మకులం అమ్మాయిని ప్రేమించి...

తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ జిల్లా మిర్యాలగూడలో పరువు హత్య జరిగింది. దళిత యువకుడు ఒకరు కమ్మ అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్న పాపానికి దళిత యువకుడుని దారుణంగా హత్యచేశారు. తాజాగా వెలుగులోకి వచ్చిన

మిర్యాలగూడలో పరువు హత్య.. కమ్మకులం అమ్మాయిని ప్రేమించి...
, శుక్రవారం, 14 సెప్టెంబరు 2018 (17:57 IST)
తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ జిల్లా మిర్యాలగూడలో పరువు హత్య జరిగింది. దళిత యువకుడు ఒకరు కమ్మ అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్న పాపానికి దళిత యువకుడుని దారుణంగా హత్యచేశారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే...
 
మిర్యాలగూడకు చెందిన దళిత యువకుడు ప్రణయ్. అదే ప్రాంతానికి చెందిన కమ్మకులానికి చెందిన అమృత అనే యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరిద్దరూ పెద్దలను ఎదిరించి ఒక్కటయ్యారు. గత యేడాదిన్నరగా కలిసి కాపురం చేస్తున్నారు. ఈ క్రమంలో అమృత గర్భందాల్చింది. 
 
దీంతో నల్లొండ జిల్లా మిర్యాలగూడలో ఉన్న ఓ ఆస్పత్రికి ఆరోగ్య చెకప్‌ కోసం తన భార్య జ్యోతిని తీసుకొచ్చాడు. వైద్య పరీక్షలన్నీ పూర్తయిన తర్వాత తన వెంట తీసుకుని బయలుదేరాడు. ఈ క్రమంలో వెనుక నుంచి పెద్ద కత్తితో వచ్చిన ఓ యువకుడు ప్రణయ్‌ మెడపై అత్యంత పాశవికంగా నరికాడు. 
 
ఒక్క దెబ్బతో కిందపడిపోగా, రెండోసారి మెడపై నరకడంతో ప్రాణాలు విడిచాడు. పక్కా ప్లాన్‌తో ఆస్పత్రి ప్రధాన ద్వారం వద్దే ఈ హత్య జరిగింది. ఈ దాడిని అడ్డుకునేందుకు అమృత ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. ఒక్కసారిగా జరిగిన ఈ ఘటనతో భయభ్రాంతులకు గురైన ఆమె అక్కడ నుంచి ఆస్పత్రిలోకి పరుగులు తీసింది.  
 
ఈ హత్యకు సంబంధించిన దృశ్యాలు ఆస్పత్రిలో అమర్చిన సీసీటీవీ ఫుటేజీల్లో స్పష్టంగా నమోదైంది. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రష్యా విమానాశ్రయంలో పాములా? అవి విషపూరితమా?