Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నిన్న మిర్యాలగూడలో.. నేడు ఎర్రగడ్డలో.. ప్రేమజంటపై వధువు తండ్రిదాడి

నల్గొండ జిల్లా మిర్యాలగూడలో జరిగిన పరువు హత్య రెండు తెలుగు రాష్ట్రాల్లోనేకాకుండా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ఘటన మరువకముందే హైదరాబాద్ ఎర్రగడ్డలో ఇదే తరహా ఘటన జరిగింది.

నిన్న మిర్యాలగూడలో.. నేడు ఎర్రగడ్డలో.. ప్రేమజంటపై వధువు తండ్రిదాడి
, బుధవారం, 19 సెప్టెంబరు 2018 (17:20 IST)
నల్గొండ జిల్లా మిర్యాలగూడలో జరిగిన పరువు హత్య రెండు తెలుగు రాష్ట్రాల్లోనేకాకుండా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ఘటన మరువకముందే హైదరాబాద్ ఎర్రగడ్డలో ఇదే తరహా ఘటన జరిగింది. ఎర్రగడ్డ గోకుల్ థియేటర్ వద్ద నడిరోడ్డుపై ఓ ప్రేమజంట(సందీప్-మాధవి)పై యువతి తండ్రి దాడిచేశాడు. ఎస్సార్ నగర్‌ పోలీస్ స్టేషన్ పరిధిలో మరో దారుణం జరిగింది.
 
బైక్‌పై వచ్చిన యువతి తండ్రి వెనుక నుంచి వేట కొడవలితో దాడి చేసి అనంతరం అక్కడ నుంచి పరారయ్యాడు. దాడిలో గాయపడిన వారిని స్థానికులు సనత్ నగర్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. కాగా యువతి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో మెరుగైన చికిత్స కోసం మాధవిని యశోదా ఆస్పత్రికి తరలించారు. 
 
కాగా సందీప్‌, మాధవి ఇటీవల ప్రేమ వివాహం చేసుకున్నారు. అయితే ఈ వివాహం ఇష్టంలేని మాధవి తండ్రి ఈ ఘటనకు పాల్పడ్డాడు. కాగా కులాంతర వివాహం చేసుకున్న సందీప్ - మాధవి తమకు రక్షణ కల్పించాలంటూ ఎస్సార్ నగర్ పోలీసుల్ని ఆశ్రయించారు. దీంతో ఇరు కుటుంబాలను పెద్దలను పిలిపించిన పోలీసులు వారికి కౌన్సెలింగ్ ఇచ్చి పంపించారు. ఎలాంటి హాని చేయవద్దని హెచ్చరించి పంపించారు కూడా. అయినప్పటికీ ఆ యువతి తండ్రి ఈ దాడికి పాల్పడ్డాడు. ఈ దాడిలో వధూవరులిద్దరూ గాయపడ్డారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మరో ఘోరం... పరువు హత్యాయత్నం... ప్రేమికులపై కత్తితో దాడి...