Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తమిళనాడు మీదుగా ఉపరితల ద్రోణి.. ఏపీలో వర్షాలు, పిడుగులు

తమిళనాడు మీదుగా ఉపరితల ద్రోణి.. ఏపీలో వర్షాలు, పిడుగులు
, శనివారం, 6 మే 2023 (10:02 IST)
దక్షిణ కర్ణాటక, తమిళనాడు మీదుగా ఉపరితల ద్రోణి కొనసాగుతుండటంతో ఏపీలో మరికొన్ని రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. శనివారం తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయి. ఆదివారం పలు జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. 
 
కొన్ని చోట్ల పిడుగులు పడే అవకాశం వుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆదివారం ప్రకాశం, కృష్ణా, తిరుపతి, బాపట్ల, నెల్లూరు, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో కొన్నిచోట్ల భారీ వర్షాలు పడే సూచనలు ఉన్నాయని తెలిపింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఇన్‌స్టా రీల్స్.. వేగంగా వచ్చిన రైలు ముందు యువకుడు.. ఏమైందో తెలుసా?