Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నారు మడికి నీరు కట్టేందుకు వెళ్లి.. పొలంలోనే...

రైతులు తమకు అన్నం పెట్టే పంటపొలాల్లోనే ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా మరో రైతు కన్నుమూశారు. నారు మడికి నీరు కట్టేందుకు వెళ్లి ఓ యువరైతు విద్యుదాఘాతంతో పొలంలోనే చనిపోయాడు. ఈ విషాదకర ఘటన జగిత్యాల జిల్ల

నారు మడికి నీరు కట్టేందుకు వెళ్లి.. పొలంలోనే...
, సోమవారం, 13 ఆగస్టు 2018 (09:55 IST)
రైతులు తమకు అన్నం పెట్టే పంటపొలాల్లోనే ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా మరో రైతు కన్నుమూశారు. నారు మడికి నీరు కట్టేందుకు వెళ్లి ఓ యువరైతు విద్యుదాఘాతంతో పొలంలోనే చనిపోయాడు. ఈ విషాదకర ఘటన జగిత్యాల జిల్లా బీర్‌పూర్‌ మండలం రేకులపల్లిలో ఆదివారం జరిగింది.
 
ఈ వివరాలను పరిశీలిస్తే, గ్రామానికి చెందిన రైతు పంజాల గంగాధర్‌(32) తనకున్న పొలంలో వరి సాగుచేసేందుకు నారు పోశాడు. రెండు రోజులుగా వర్షాలు కురుస్తుండటంతో పొలం నాటు వేయాలని నిర్ణయించాడు. ఈ క్రమంలో నారు మడికి నీరుపెట్టేందుకు ఉదయం వెళ్లాడు. కరెంట్‌ లేకపోవడంతో మోటార్‌ ఆన్‌కాలేదు. దీంతో పంపులోకి కుండతో నీరు పోశాడు. ఈ క్రమంలోనే విద్యుత్‌ సరఫరా కావడంతో మోటార్‌ స్టార్టయ్యింది. పొలం నుంచి బయటకు వచ్చే క్రమంలో పైపును పట్టుకున్నాడు.
 
అప్పటికే మోటార్‌పంపు పైపునకువిద్యుత్‌ సరఫరా కావడంతో గంగాధర్‌ విద్యుదాఘాతానికి గురయ్యాడు. సమీపంలోనే ఉన్న అతని భార్య రజిత, వ్యవసాయకూలీలు గమనించి పెద్దగా కేకలు వేయడంతో మరికొందరు రైతులు సబ్‌స్టేషన్‌కు సమాచారం అందించి విద్యుత్‌ సరఫరా నిలిపివేయించారు. అయితే అప్పటికే గంగాధర్‌ మృతిచెందాడు. భార్య రజిత, కుమారుడు సిద్దు, కూతురు అక్షయ ఉన్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

లోక్‌సభ మాజీ స్పీకర్ సోమ్‌నాథ్‌ చటర్జీ కన్నుమూత