Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బద్వేల్ బైపోల్ : పోటీకి జనసేన సిద్ధం

బద్వేల్ బైపోల్ : పోటీకి జనసేన సిద్ధం
, గురువారం, 30 సెప్టెంబరు 2021 (16:15 IST)
కడప జిల్లాలోని బద్వేల్ అసెంబ్లీ స్థానానికి అక్టోబరు 30వ తేదీన ఉప ఎన్నిక పోలింగ్ జరుగనుంది. ఇందుకోసం కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీచేసింది. తెలంగాణాలో హుజురాబాద్‌ నియోజకవర్గ ఉప ఎన్నికతో పాటు బద్వేలు ఉప ఎన్నిక నిర్వహించనున్నట్టు ప్రకటించింది. అక్టోబరు 30వ తేదీన ఉప ఎన్నిక పోలింగ్ జరుగనుండగా అక్టోబరు ఒకటో తేదీన నోటిఫికేషన్ విడుదలకానుంది. నవంబర్ 2వ తేదీ ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటన కూడా చేయనున్నారు. 
 
అయితే ఈ ఉప ఎన్నికల్లో వెంకట సుబ్బయ్య సతీమణి డాక్టర్ సుధకు సీఎం జగన్ టికెట్ ఖరారు చేయగా… టీడీపీ అభ్యర్థిగా డా. ఓబుళాపురం రాజశేఖర్‌‌ను ఇప్పటికే ప్రకటించారు చంద్రబాబు. అటు బీజేపీ, జనసేన, కాంగ్రెస్‌ పార్టీలు ఇంకా తమ అభ్యర్థులను ప్రకటించలేదు.
 
ఈ నేపథ్యంలోనే బద్వేలు ఉప ఎన్నికల్లో పోటీపై బీజేపీ-జనసేన మధ్య సంప్రదింపులు కొనసాగుతోంది. ఏ పార్టీ పోటీ చేయాలనే అంశంపై తర్జన భర్జన అవుతున్నాయి. జనసేన నుంచి అభ్యర్థిని పెట్టాలని బీజేపీ సూచించినట్లు సమాచారం అందుతోంది. తిరుపతిలో బీజేపీ పోటీ చేసిన కారణంగా బద్వేల్లో జనసేనకు అవకాశం ఇవ్వాలన్న యోచనలో బీజేపీ పార్టీ ఉన్నట్లు సమాచారం. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నిజామాబాద్ యువతి అత్యాచార కేసులో ముగ్గురి అరెస్టు