Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కాకినాడలో యువ డాక్టర్ ఆత్మహత్య

doctor
, ఆదివారం, 26 నవంబరు 2023 (21:06 IST)
ఏపీలోని కాకినాడలో యువ డాక్టర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ భూవివాదం కారణంగా యువ డాక్టర్ ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. భూ వివాదం పరిష్కారంలో మోసపోయాననే మనస్తాపంతో పురుగు మందు తాగాడు. 
 
కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ కన్నుమూశాడు. నగరంలోని అశోక్ నగర్‌కు చెందిన డాక్టర్ నున్న శ్రీకిరణ్ చౌదరి శనివారం బలవన్మరణానికి పాల్పడ్డాడు. రష్యాలో ఎంబీబీఎస్ పూర్తి చేసి తిరిగొచ్చిన శ్రీకిరణ్.. కాకినాడ జీజీహెచ్ మార్చురీ విభాగంలో డ్యూటీ చేస్తున్నాడు. 
 
భూవివాదం పరిష్కారం కోసం వైసీపీ నేతల సాయం కోరగా.. ఆస్తి పత్రాలు తీసుకుని వేధింపులకు గురిచేశారంటూ శ్రీకిరణ్ తల్లి రత్నం ఆరోపిస్తున్నారు.  

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చైనా చిన్నారుల్లో న్యుమోనియా కేసులు.. క్లినిక్స్ పెంచాలని..?