Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

'ఎవడు' టైప్‌లో ప్రియురాలు మాస్టర్ ప్లాన్... మటన్ సూప్‌ పట్టిచ్చింది...

నాగర్‌కర్నూలు జిల్లాలో ప్రియుడితో కలిసి భర్తను హతమార్చి.. ఆపై ప్రియుడిపై యాసిడ్‌పోసి ఆస్పత్రిలో చేర్చిన స్వాతి పోలీసుల అదుపులో వున్న సంగతి తెలిసిందే. కార్పొరేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రాజేష్‌న

'ఎవడు' టైప్‌లో ప్రియురాలు మాస్టర్ ప్లాన్... మటన్ సూప్‌ పట్టిచ్చింది...
, మంగళవారం, 12 డిశెంబరు 2017 (20:49 IST)
నాగర్‌కర్నూలు జిల్లాలో ప్రియుడితో కలిసి భర్తను హతమార్చి.. ఆపై ప్రియుడిపై యాసిడ్‌పోసి ఆస్పత్రిలో చేర్చిన స్వాతి పోలీసుల అదుపులో వున్న  సంగతి తెలిసిందే. కార్పొరేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రాజేష్‌ను పోలీసులు అదుపులోకి తీసుకోనున్నట్లు తెలుస్తోంది. రాజేష్‌తో సెటిలైపోయేందుకు స్వాతి మాస్టర్‌ ప్లాన్‌ వేసింది. కానీ స్వాతి ప్లాన్‌ను సుధాకర్‌రెడ్డి తల్లిదండ్రులు బట్టబయలు చేశారు. 
 
ఎలాగంటే..? యాసిడ్ దాడి జరిగిన తమ కుమారుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా.. కోడలికి ధైర్యం చెప్పేందుకు.. ఆస్పత్రిలో సుధాకర్‌ను చూసేందుకు అతడి తల్లిదండ్రులు వచ్చారు. తమ కుమారుడేనని భావిస్తున్న వారికి తొలి అనుమానం మటన్ సూప్ వద్ద వచ్చింది. చికిత్స పొందుతున్న వ్యక్తి రాజేష్ అని సుధాకర్ కాదనే అనుమానం ఆయన తల్లిదండ్రులకు ఎలా వచ్చిందంటే... సాధారణంగా ఆసుపత్రి బెడ్‌పై ఉంటే, వారికి బలవర్ధక ఆహారంగా మటన్ సూప్‌ను ఇస్తారు. ఇదే తరహాలో రాజేష్‌కు ఆస్పత్రి వర్గాలు మటన్ సూప్ ఇచ్చారు. 
 
కానీ దాన్ని రాజేష్ నిరాకరించాడు. సుధాకర్ మాంసాహారి కావడం.. అతనికి మటన్ సూప్ అంటే తెగ ఇష్టం. కానీ రాజేష్ మటన్ సూప్ వద్దనడం.. దాన్ని ముట్టుకోకపోవడంతో అతనిపై వారికి అనుమానం వచ్చింది. ఈ అనుమానంతోనే ఈ కేసు తమ వరకు వచ్చిందని.. సుధాకర్ తల్లిదండ్రులు పోలీసులు ఇచ్చిన ఫిర్యాదుతోనే స్వాతి బండారాన్ని బట్టబయలు చేయగలిగామని పోలీసులు తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రూ.22కే పెట్రోల్ - ఎప్పటి నుంచో తెలుసా?