Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పెళ్ళైన వారానికే భర్తకు బిస్కెట్ - ప్రియుడితో కాపురం.. ఎక్కడ?

పెళ్ళయి సరిగ్గా వారం రోజులయ్యింది. ప్రియుడిపై ఉన్న మోజును తగ్గించుకోలేకపోయింది. దీంతో మొగుడును వదిలేసి ప్రియుడితో పారిపోయి వేరు కాపురం పెట్టేసింది. ఇదంతా ఎక్కడో కాదు చిత్తూరు జిల్లా తిరుపతిలోని మంగళంలో జరిగింది.

పెళ్ళైన వారానికే భర్తకు బిస్కెట్ - ప్రియుడితో కాపురం.. ఎక్కడ?
, శనివారం, 11 ఆగస్టు 2018 (16:00 IST)
పెళ్ళయి సరిగ్గా వారం రోజులయ్యింది. ప్రియుడిపై ఉన్న మోజును తగ్గించుకోలేకపోయింది. దీంతో మొగుడును వదిలేసి ప్రియుడితో పారిపోయి వేరు కాపురం పెట్టేసింది. ఇదంతా ఎక్కడో కాదు చిత్తూరు జిల్లా తిరుపతిలోని మంగళంలో జరిగింది.
 
చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం కాసర గ్రామానికి చెందిన తులసికి, అదే ప్రాంతానికి చెందిన రమ్యకు వారంరోజుల క్రితం వివాహమైంది. రమ్యకు వివాహం కాకముందే పురుషోత్తం అనే యువకుడితో పరిచయం ఉంది. పరిచయం కాస్తా శారీరక సంబంధానికి దారితీసింది. అయితే ఇంట్లో వాళ్ళ ఒత్తిడి తట్టుకోలేక తులసిని వివాహం చేసుకుంది.
 
వివాహమైన తరువాత కూడా ప్రియుడు పురుషోత్తంను మర్చిపోలేకపోయింది. దీంతో తిరుపతిలోని మంగళంలో ఉన్న ప్రియుడిని కలుసుకునేందుకు వచ్చేసింది. నా భర్తను వదిలేసి నీతోనే వుంటానని చెప్పడంతో అతడు సరేనన్నాడు. దాంతో వేరు కాపురం పెట్టేసింది. భర్త తులసి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే రమ్య మేజర్ కావడంతో పోలీసులు కూడా వదిలేశారు. దీంతో ప్రియుడితో కాపురం పెట్టేసింది రమ్య.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

దేవాలయంలోనే అత్యాచారం.. కత్తులతో దాడి.. సజీవదహనం.. ఎక్కడ?