Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వారంతా నన్ను తట్టిలేపే నిశ్బబ్ద యోధులు : పవన్ కళ్యాణ్

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మరోమారు ట్విట్టర్ వేదికగా ఓ పోస్ట్ చేశారు. తన అభిమాని రచయిత దుశర్ల సత్యనారాయణ రాసిన "జల సాధన సమరం" పుస్తకం కవర్ పేజీని పోస్టు చేశారు.

వారంతా నన్ను తట్టిలేపే నిశ్బబ్ద యోధులు : పవన్ కళ్యాణ్
, సోమవారం, 30 ఏప్రియల్ 2018 (10:29 IST)
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మరోమారు ట్విట్టర్ వేదికగా ఓ పోస్ట్ చేశారు. తన అభిమాని రచయిత దుశర్ల సత్యనారాయణ రాసిన "జల సాధన సమరం" పుస్తకం కవర్ పేజీని పోస్టు చేశారు. అందులో ఈ సమాజంలోని ఎంతో మంది గొప్ప రచయితలు తనకు స్ఫూర్తినిస్తూ, తట్టి లేపుతుంటారని వారంతా నిశ్శబ్ద యోధులని పేర్కొన్నారు. ఆ తర్వాత మరో అభిమాన రచయిత గుంటూరు శేషేంద్ర శర్మ రాసిన ఓ కవితను పోస్టు చేశారు. ప్రస్తుతం ఈ కవిత సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ కవిత మీరూ చదవండి.
 
"మహితాత్ములు ఎందరు భువిలో
శ్వాస పీల్చి చాలించారో
భూమి మీద నిశబ్దంగా
నడిచి నిష్క్రమించారో
మైకు ఒక్కటి ముట్టలేదు
పత్రికలో మెట్టలేదు
వాళ్లంతా నడిచిన దారులు
వార్తలుగా మారలేదు
మెరిసే మకుటుం మినహా
శిరసె కనిపించని నూతన
రాజులు ఎంగిలి కూతలు
పేజీలైపోతుంటే
చప్పుడు చెయ్యని అడుగులు
చరిత్రలోకెక్కలేదు" అనే కవితను జనసేనాన్ని పోస్ట్ చేశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కేసీఆర్ మా స్నేహితుడే.... ఆయన ప్రయత్నం స్వాగతిస్తున్నా : అమిత్ షా