Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నేటి నుంచి పవన్ కళ్యాణ్ పొలిటికల్ జర్నీ

జనసేనాని, పవర్ స్టార్ కళ్యాణ్ రాజకీయ యాత్ర సోమవారం నుంచి ప్రారంభంకానుంది. పవన్ కళ్యాణ్ ఇంటి ఇలవేల్పు అయిన కరీంనగర్ జిల్లాలోని కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయం నుంచి ఆయన తన పొలటికల్ జర్నీకి శ్రీకారం చుట్టను

నేటి నుంచి పవన్ కళ్యాణ్ పొలిటికల్ జర్నీ
, సోమవారం, 22 జనవరి 2018 (09:34 IST)
జనసేనాని, పవర్ స్టార్ కళ్యాణ్ రాజకీయ యాత్ర సోమవారం నుంచి ప్రారంభంకానుంది. పవన్ కళ్యాణ్ ఇంటి ఇలవేల్పు అయిన కరీంనగర్ జిల్లాలోని కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయం నుంచి ఆయన తన పొలటికల్ జర్నీకి శ్రీకారం చుట్టనున్నారు. 
 
కేవలం ప్రజా సమస్యల అధ్యయనం కోసమే రాజకీయ యాత్ర ప్రాంభిస్తున్నట్టు ఇప్పటికే ఆయన ప్రకటించిన విషయం తెల్సిందే. ఇందులోభాగంగా సోమవారం కొండగట్టు ఆంజనేయస్వామిని దర్శించుకొని యాత్రను ప్రారంభించనున్నారు. 
 
మొత్తం మూడు జిల్లాల్లో పర్యటించనున్నట్టు చెప్పారు. ఇదే అంశంపై ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. ఆంజనేయస్వామి దర్శనానంతరం యాత్ర వివరాలు వెల్లడిస్తానని తెలిపారు. కార్యకర్తలతో సమావేశమయ్యాక తెలంగాణలో చేయబోయే పర్యటన వివరాలు కొండగట్టు వేదికగా ప్రకటిస్తానని వెల్లడించారు. 
 
అంతకుముందు సికింద్రాబాద్‌లోని సెయింట్ మేరీస్ చర్చిలో భార్య అన్నా, పోలండ్ అంబాసిడర్ ఆడమ్‌తో కలిసి ప్రార్థనలు చేశారు. అనంతరం అక్కడ ఉన్న జనసేన కార్యాలయంలో పోలండ్ ప్రతినిధులతో పవన్‌కల్యాణ్ సమావేశమయ్యారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రేమలో పడిన కలెక్టర్ ... 18న జూనియర్ ఐపీఎస్‌తో పెళ్లి