Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పురుడు పోసుకోకముందే రజినీ పార్టీ విలీనం?

తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ రాజకీయ రంగప్రవేశం దక్షిణాదిలోనేకాకుండా దేశవ్యాప్తంగా ఓ సంచలనంగా మారింది. పైగా, ఆయన రాజకీయాల్లోకి వస్తే తమిళనాడు రాష్ట్రంలో పెనుమార్పులు చోటుచేసుకుంటాయని ప్రతి ఒక్కరూ భావిం

పురుడు పోసుకోకముందే రజినీ పార్టీ విలీనం?
, శుక్రవారం, 7 సెప్టెంబరు 2018 (17:29 IST)
తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ రాజకీయ రంగప్రవేశం దక్షిణాదిలోనేకాకుండా దేశవ్యాప్తంగా ఓ సంచలనంగా మారింది. పైగా, ఆయన రాజకీయాల్లోకి వస్తే తమిళనాడు రాష్ట్రంలో పెనుమార్పులు చోటుచేసుకుంటాయని ప్రతి ఒక్కరూ భావించారు. అలాంటి పరిస్థితుల్లో రజినీ మక్కల్ మండ్రం పేరుతో ఆయన ఓ పార్టీని స్థాపించారు. ఇందులో చేరేందుకు ఆయన అభిమానులు క్యూ కట్టారు.
 
ఇంతలోనే ఓ సంచలన వార్త వెలుగులోకి వచ్చింది. పూర్తిస్థాయిలో పురుడు పోసుకోకముందే బీజేపీలో తన పార్టీని విలీనం చేయడానికి రజినీ రెడీ అవుతున్నారంటూ ఓ వార్తా కథనం జాతీయ మీడియాలో జోరుగా ప్రసారమవుతోంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాతో రజినీ మంతనాలు జరిపినట్టు ఆ వార్తాకథనం సారాంశం. 
 
బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాతో రజినీ మంతనాలు జరిపినట్టు ఆ వార్తాకథనం సారాంశం. ఢిల్లీ వేదికగా ఇప్పటికే ఏడు సార్లు ఇద్దరూ కలిసి చర్చించినట్టు చెబుతున్నారు. అయితే ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందనే దానిలో అనేక సందేహాలున్నప్పటికీ... ఈ విషయాన్ని రజినీ ఫ్యాన్స్... అందునా తమిళులు ఎంతగా స్వాగతిస్తారో వేచిచూడాల్సిందే. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మేము ఊరకుక్కలమైతే.. నువ్వు ఊరపందివా? : జగన్‌పై మంత్రి ఆదినారాయణ ప్రశ్న