Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

టిడిపిలోకి జగన్ సన్నిహితుడు-ఎమ్మెల్యే జంపవుతున్నారా...?

అధికార పార్టీలోకి ప్రతిపక్ష ఎమ్మెల్యేలు క్యూ కడుతున్నారు. తాజాగా పాడేరు ఎమ్మెల్యే ఈశ్వరి తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకోగా మరో ఎమ్మెల్యే కూడా వెళ్ళేందుకు రంగం సిద్ధం చేసుకున్నాడనే వార్తలు వస్తున్నాయ

టిడిపిలోకి జగన్ సన్నిహితుడు-ఎమ్మెల్యే జంపవుతున్నారా...?
, శుక్రవారం, 1 డిశెంబరు 2017 (17:03 IST)
అధికార పార్టీలోకి ప్రతిపక్ష ఎమ్మెల్యేలు క్యూ కడుతున్నారు. తాజాగా పాడేరు ఎమ్మెల్యే ఈశ్వరి తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకోగా మరో ఎమ్మెల్యే కూడా వెళ్ళేందుకు రంగం సిద్ధం చేసుకున్నాడనే వార్తలు వస్తున్నాయి. అది కూడా జగన్ మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు, చిన్ననాటి స్నేహితుడు తెలుగుదేశం పార్టీలోకి వెళుతున్నారన్న విషయం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారుతోంది. స్వయంగా మంత్రి అచ్చెన్నాయుడు ఈ విషయాన్ని ప్రకటించారు. అయితే ఎమ్మెల్యే ఎవరన్న విషయాన్ని చెప్పకుండా జగన్ సన్నిహితుడు వచ్చేస్తున్నాడు.. ఇక వైసిపి పని అయిపోయిందంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైసిపి నేతల్లో గుబులు తెప్పిస్తోంది. 
 
రాయచోటి ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి జగన్ మోహన్ రెడ్డికి చిన్ననాటి స్నేహితుడు. జగన్ మోహన్ రెడ్డికి రైట్ హ్యాండ్ కూడా. గత కొన్నిరోజులుగా వైసిపి నేతలతో అంటీముట్టనట్లు వ్యవహరిస్తున్నారు శ్రీకాంత్ రెడ్డి. అందుకే ఆయన టిడిపిలోకి వచ్చేస్తున్నారని మంత్రి స్వయంగా ప్రకటన చేశారు. ఒకవేళ శ్రీకాంత్ రెడ్డి టిడిపిలో వెళ్ళినా ఏ పదవులు రావు. 
 
చంద్రబాబుకు శ్రీకాంత్ రెడ్డి అంటే అస్సలు ఇష్టం లేదు. ఊరికే పార్టీలో నేతగా ఉండాలి తప్ప శ్రీకాంత్ రెడ్డికి ఎలాంటి ప్రయోజనం ఉండదని స్పష్టంగా అర్థమవుతోంది. అయితే ఈ విషయాన్ని శ్రీకాంత్ రెడ్డి మాత్రం కొట్టిపారేస్తున్నారు. కావాలనే అధికార పార్టీ నేతలు తమపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని మండిపడుతున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఎస్ఆర్ఎం యూనివర్శిటీ తమిళ అకాడెమీ అవార్డుల వెల్లడి