Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఎమ్మెల్యేలు పందికొక్కులా.. జగనే ఓ పెద్ద పంది కొక్కు: సోమిశెట్టి

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేలను పందికొక్కులు అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేయడంపై కర్నూలు జిల్లా టీడీపీ అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు ఫైర్ అయ్యారు. ఎమ్మెల్యేలను పందికొక్క

ఎమ్మెల్యేలు పందికొక్కులా.. జగనే ఓ పెద్ద పంది కొక్కు: సోమిశెట్టి
, శనివారం, 2 డిశెంబరు 2017 (10:15 IST)
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేలను పందికొక్కులు అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేయడంపై కర్నూలు జిల్లా టీడీపీ అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు ఫైర్ అయ్యారు. ఎమ్మెల్యేలను పందికొక్కులు అంటున్న జగనే పెద్ద పందికొక్కు అన్నారు. 
 
జగన్‌కు నాయకత్వ లక్షణాలు లేవన్నారు. పోలవరం ప్రాజెక్టును జగనే అడ్డుకుంటున్నారని.. కేంద్రానికి రహస్యంగా లేఖలు రాస్తూ.. రాష్ట్ర అభివృద్ధికి అడ్డుపడుతున్నారని సోమిశెట్టి తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేశారు. సొంత ఛానల్, సొంత పేపర్లో తప్పుడు కథనాలను ప్రచారం చేస్తూ, రాష్ట్రాన్ని అగ్నిగుండంగా మార్చే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. 
 
సీఎం కుర్చీ కోసం కలలు కంటూ, ఆచరణకు సాధ్యం హామీలతో ప్రజలను మోసం చేస్తూ పాదయాత్ర చేస్తున్నారని మండిపడ్డారు. జగన్‌కు బీసీలంటే గౌరవం లేదని.. పాదయాత్రలో వారి గురించి ఒక్క మాట కూడా మాట్లాడట్లేదన్నారు. జగన్ ఎప్పటికీ సీఎం కాలేరని... 2019లో ఆయనకు రాజకీయ సమాధి తప్పదని జోస్యం చెప్పారు. జగన్‌ను రాళ్లతో కొట్టాలని సోమిశెట్టి అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ట్రిపుల్ తలాఖ్‌ చెప్తే మూడేళ్ల జైలు.. కొత్తబిల్లు..