Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పవన్ కళ్యాణ్ పోటీలో లేకుంటే పిఠాపురం అభ్యర్థిని నేనే : ఎస్వీఎస్ఎన్ వర్మ

svsnvarma

సెల్వి

, బుధవారం, 20 మార్చి 2024 (14:32 IST)
పిఠాపురం అసెంబ్లీ స్థానం నుంచి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పోటీలో లేకుంటే తానే అభ్యర్థిగా పోటీలోవుండేవాడినని టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ అన్నారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, పిఠాపురం అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ లాంఛన ప్రాయమేనని అన్నారు. తాను గత రెండు దశాబ్దాలుగా పార్టీలో కొనసాగుతూ పార్టీ పురోగతితో పని చేస్తున్నట్టు చెప్పారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆదేశాలతో పవన్ కోసం తన సీటును త్యాగం చేసినట్టు చెప్పారు. ఎంతో బాధతో ఈ స్థానాన్ని వదులుకున్నా. ఆయన విజయానికి కృషిచేస్తా. పవన్‌ కాకినాడ ఎంపీగా పోటీ చేస్తే పిఠాపురం నుంచి తానే బరిలో ఉంటానని చెప్పారు. 
 
మంగళగిరి పార్టీ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన సమావేశంలో పవన్‌ కల్యాణ్‌ మాట్లాడుతూ లోక్‌సభ, శాసనసభ స్థానాల్లో పోటీపై స్పందించారు. 'కేంద్ర పెద్దలు శాసనసభ, లోక్‌సభ స్థానాలు రెండింటిలోనూ పోటీ చేయాలన్నారు. శాసనసభకు పోటీ చేయడమే నాకు ఇష్టం. రాష్ట్రానికి ముందు పని చేసి ఆ తర్వాత దేశం కోసం ఆలోచిస్తా. ఒకవేళ లోక్‌సభకే పోటీ చేయాలని మోడీ, అమిత్‌షా అడిగితే అప్పుడు కాకినాడ స్థానం నుంచి పోటీ చేస్తా. ఆ పరిస్థితుల్లో ఉదయ్‌ శ్రీనివాస్‌ పిఠాపురం నియోజకవర్గానికి వస్తారు' అని పవన్‌ తెలిపారు. ఈ నేపథ్యంలో వర్మ తాజాగా చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. అయితే, పవన్ కళ్యాణ్ మాత్రం అసెంబ్లీ అభ్యర్థిగానే పోటీ చేస్తానని చెప్పారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రేకుల షెడ్డును ఎత్తుకెళ్లిన సుడిగాలి.. చిన్నారి మృతి