Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సీఎం రమేష్ 'ఉక్కు' దీక్ష - క్షీణిస్తున్న ఆరోగ్యం...

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కడప జిల్లాలో ఉక్కు కర్మాగారాన్ని ఏర్పాటు చేయాలన్న ప్రధాన డిమాండ్‌తో అధికార తెలుగుదేశం పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ ఆమరణ నిరాహారదీక్షకు దిగారు. ఆయన ఆరోగ్యం క్షీణ

సీఎం రమేష్ 'ఉక్కు' దీక్ష - క్షీణిస్తున్న ఆరోగ్యం...
, ఆదివారం, 24 జూన్ 2018 (13:33 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కడప జిల్లాలో ఉక్కు కర్మాగారాన్ని ఏర్పాటు చేయాలన్న ప్రధాన డిమాండ్‌తో అధికార తెలుగుదేశం పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ ఆమరణ నిరాహారదీక్షకు దిగారు. ఆయన ఆరోగ్యం క్షీణిస్తున్నా ఆయన మాత్రం ఉక్కు సంకల్పంతో దీక్షను కొనసాగిస్తున్నారు.
 
దీంతో ఆయనకు శనివారం వైద్యులు పరీక్షలు చేశారు. కడప రిమ్స్ వైద్య బృందం ఈ పరీక్షలు నిర్వహించింది. ప్రస్తుతం సీఎం రమేష్ చాలా నీరసంగా ఉన్నారని, షుగర్ లెవల్స్ తగ్గాయని, బీపీ కూడా తగ్గుతోందని తెలిపారు. 
 
మరోవైపు, రమేష్ దీక్షకు మద్దతిస్తున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. శనివారం ఉదయం ఎమ్మెల్యేలు బొండా ఉమ, ప్రభాకర్ చౌదరి, సాయినాథ్ గౌడ్ తదితరులు కడపకు వచ్చి రమేష్, రవిలను పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిపై డాక్టర్లను వాకబు చేశారు. కాగా, సీఎం రమేష్‌తో పాటు.. ఎమ్మెల్సీ బీటెక్ రవి కూడా ఈ దీక్ష చేస్తున్న విషయం తెల్సిందే. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శ్మశానంలో నిద్రించిన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే.. ఎందుకు?