Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అవ్వ.. అమ్మ.. ఓ మనవరాలు.. సినిమా టైటిల్ కాదు... దొంగల ముఠా

అవ్వ.. అమ్మ.. ఓ మనవరాలు.. ఇదేదో ఓ తెలుగు సినిమా టైటిల్ అనుకుంటే పప్పులో కాలేసినట్టే. మూడు తరాలుగా దొంగతనాలు చేస్తూ జీవనం సాగిస్తూ వస్తున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠా. ఈ ముఠా పాపం ఇప్పటికి పండింది.

అవ్వ.. అమ్మ.. ఓ మనవరాలు.. సినిమా టైటిల్ కాదు... దొంగల ముఠా
, మంగళవారం, 5 జూన్ 2018 (10:50 IST)
అవ్వ.. అమ్మ.. ఓ మనవరాలు.. ఇదేదో ఓ తెలుగు సినిమా టైటిల్ అనుకుంటే పప్పులో కాలేసినట్టే. మూడు తరాలుగా దొంగతనాలు చేస్తూ జీవనం సాగిస్తూ వస్తున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠా. ఈ ముఠా పాపం ఇప్పటికి పండింది. ఫలితంగా పోలీసులకు చిక్కారు. వీరి నుంచి 6.42 లక్షల నగదుతో పాటు బంగారు నగలను కూడా స్వాధీనం చేసుకున్నారు.
 
తిరుపతి పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు తులసి అలియాస్‌ నిర్మల అలియాస్‌ సయ్యద్‌ రషీద్‌ బేగం(58), ఎం.లక్ష్మి అలియాస్‌ మీరున్నిషా(35), ఎం.సోనీ అలియాస్‌ రిజ్వాన(19)... అవ్వ, అమ్మ, మనవరాలు. వీరి సొంతూరు హైదరాబాద్‌లోని అంబర్‌పేట. ఎక్కడ దొంగతనం చేయాలన్నా ముందుగా ఖరీదైన దుస్తులు వేసుకుని, స్టార్‌ హోటళ్లలో బస చేస్తూ రెక్కీ నిర్వహిస్తారు. ఆ తర్వాత గుట్టుచప్పుడు కాకుండా పనిపూర్తిచేసి అక్కడ నుంచి జారుకుంటారు. 
 
ఇలా హైదరాబాద్‌, దాని పరిసర ప్రాంతాలు, తిరుపతి, తిరుచానూరు ఇతర నగరాల్లో మహిళల మెడల్లోని బంగారు గొలుసులను అపహరించారు. ఈ క్రమంలో రెండు రోజుల క్రితమే ముగ్గురూ కలిసి తిరుపతి వచ్చారు. తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి ఆలయం మెట్లపై అనుమానాస్పద స్థితిలో ఉన్న వీరి గురించి సమాచారం రావడంతో సీఐ పద్మలత బృందం అదుపులోకి తీసుకుంది. వీరిపై ఏపీ, తెలంగాణల్లో 100కు పైగా కేసులున్నాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

గ్రహాంతరవాసి కాదు.. కోతికి మేకప్ వేసి...