Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

బాధ్యతలు చేపట్టిన మొదటిరోజే రంగంలోకి దిగిన తితిదే చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్(Video)

బాధ్యతలు చేపట్టిన మొదటిరోజే తితిదే చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్ రంగంలోకి దిగారు. తిరుమల శ్రీవారి ఆలయంలో సర్వదర్శనం కౌంటర్లు మరియు క్యూ కాంప్లెక్సులను ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ తనిఖీలో చైర్మన్‌తో పాటు జేఈఓ శ్రీనివాసరాజు ఉన్నారు. క్యూలో నిలబడి వున్న భక్త

బాధ్యతలు చేపట్టిన మొదటిరోజే రంగంలోకి దిగిన తితిదే చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్(Video)
, శనివారం, 28 ఏప్రియల్ 2018 (21:16 IST)
బాధ్యతలు చేపట్టిన మొదటిరోజే తితిదే చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్ రంగంలోకి దిగారు. తిరుమల శ్రీవారి ఆలయంలో సర్వదర్శనం కౌంటర్లు మరియు క్యూ కాంప్లెక్సులను ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ తనిఖీలో చైర్మన్‌తో పాటు జేఈఓ శ్రీనివాసరాజు ఉన్నారు. క్యూలో నిలబడి వున్న భక్తుల సమస్యలను స్వయంగా ఆయన అడిగి తెలుసుకున్నారు.
 
తనే స్వయంగా క్యూలో నడుచుకుంటూ అక్కడక్కడ పరిశుభ్రత లేని ప్రాంతాలను చూసి పగిలిన టైల్స్ మరియు గ్రానైట్లను చూసి వెంటనే వాటిని మార్చాలని సూచించారు. మహిళలు మూత్రశాలలకు వెళ్ళడానికి పడుతున్న ఇబ్బందిని చూసి సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అలాగే సర్వదర్శనానికి సంబంధించిన సైన్ బోర్డులను ఏర్పాటు చేయాలని భక్తులు కోరగా వెంటనే ఏర్పాటు చేయాలని ఆదేశాలు ఇచ్చారు. సామాన్య భక్తుల సమస్యలు సామాన్య భక్తుడిలా వెళ్లి తెలుసుకున్నారు టీటీడీ చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్. వీడియో చూడండి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చిరంజీవి 'తమ్ముడు' జనసేనానితోనేనా...?