Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

తిరుమలలో రోజా వెంటపడ్డ టిటిడి విజిలెన్స్ అధికారి.. ఎందుకు?

తిరుమలలో నటి, వైసిపి ఎమ్మెల్యే రోజా వెనుక ఒక టిటిడి విజిలెన్స్ అధికారి పడ్డాడు. తిరుమల శ్రీవారిని దర్శించుకుని ఆలయం బయటకు వచ్చిన రోజా, తన కారు ఎక్కేంతవరకు కూడా ఆ విజిలెన్స్ అధికారి వెంటపడ్డాడు. రోజా వెనుక ఒక టిటిడి విజిలెన్స్ అధికారి వెంట పడటం చూసిన

తిరుమలలో రోజా వెంటపడ్డ టిటిడి విజిలెన్స్ అధికారి.. ఎందుకు?
, మంగళవారం, 12 డిశెంబరు 2017 (21:54 IST)
తిరుమలలో నటి, వైసిపి ఎమ్మెల్యే రోజా వెనుక ఒక టిటిడి విజిలెన్స్ అధికారి పడ్డాడు. తిరుమల శ్రీవారిని దర్శించుకుని ఆలయం బయటకు వచ్చిన రోజా, తన కారు ఎక్కేంతవరకు కూడా ఆ విజిలెన్స్ అధికారి వెంటపడ్డాడు. రోజా వెనుక ఒక టిటిడి విజిలెన్స్ అధికారి వెంట పడటం చూసిన భక్తులు ఆశ్చర్యానికి గురయ్యారు.
 
అయితే ఆ అధికారి రోజాను తిరుమల మాడవీధుల్లో మాట్లాడనీయకుండా ఉండేందుకు వెంటపడినట్లు మీడియా ప్రతినిధులు తరువాత గుర్తించారు. తిరుమల పుణ్యక్షేత్రంలో రోజా ఇష్టానుసారం మాట్లాడుతున్నారని గతంలో టిటిడి ఉన్నతాధికారులకు కొంతమంది ఫిర్యాదు చేశారు. దీంతో టిటిడి విజిలెన్స్ అధికారులు రోజాకు ఆ విషయాన్ని చెప్పేందుకు ఆమె వెంట పడ్డాడు. 
 
చివరకు ఆలయం ముందు రోజా మాట్లాడుతుండగా... మేడం మాట్లాడొద్దు అంటూ చెప్పే ప్రయత్నం విజిలెన్స్ అధికారి చేసినా ఆమె మాత్రం మాట్లాడుతూనే ఉండిపోయారు. చివరకు చేసేదేమీ లేక ఆ విజిలెన్స్ అధికారి అక్కడి నుంచి వెళ్ళిపోయారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పెంచుకుంటానని తెచ్చి 13 ఏళ్ల బాలికకు వివాహం... నిద్రమాత్రలిచ్చి శోభనం...