Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో తులాభారం ప్రారంభం

శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో తులాభారం ప్రారంభం
, శుక్రవారం, 20 ఆగస్టు 2021 (21:24 IST)
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో వరలక్ష్మీ వ్రతం పర్వదినం సందర్భంగా శుక్రవారం టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, రాష్ట్ర బిసి సంక్షేమ శాఖ మంత్రి వేణుగోపాల కృష్ణ, టిటిడి ఈవో డాక్టర్ కె. ఎస్.జవహర్ రెడ్డితో కలిసి తులాభారం ప్రారంభించారు. 
 
ఆలయంలోని సుందరరాజ స్వామివారి ముఖ మండపంలో శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించిన అనంతరం చైర్మన్ దంపతులు, మంత్రి, ఈవో తమ బరువుకు తగిన బియ్యం, చక్కెర, బెల్లం సమర్పించి తులాభారం ప్రారంభించారు.
 
తిరుమల శ్రీవారి ఆలయం తరహాలో తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో తులాభారం ప్రవేశపెట్టాలని టీటీడి నిర్ణ నిర్ణయించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా చెన్నైకి చెందిన జయచంద్ర దంపతులు రూ.17 లక్షల విలువైన  తులాభారం ఆలయానికి బహూకరించారు.

ఈ కార్యక్రమంలో జెఈవో స‌దా భార్గ‌వి,  అదనపు సివిఎస్వో శివకుమార్ రెడ్డి, ఆల‌య డెప్యూటి ఈవో క‌స్తూరి బాయి, ఏఈవో ప్ర‌భాక‌ర్‌రెడ్డి, అర్చ‌కులు బాబుస్వామి పాల్గొన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

త్వరలో అందుబాటులోకి మూడు డోసుల టీకా!