Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కోర్కె తీర్చలేదని కక్షకట్టి ఉద్యోగం నుంచి తొలగించారు...

ఆమె అనాథ. కడుపేదరికం కారణంగా వివాహం చేసుకోలేదు. చిన్న ఉద్యోగం చేసుకుంటూ పొట్టపోసుకుంటోంది. ఆమెపై ఎటువంటి అవినీతి ఆరోపణలు లేవు.. అయినా ఆ నిరుపేదరాలిపై కక్షగట్టారు. కారణం.. ఓ కామాంధుడి కోర్కె తీర్చలేదని

కోర్కె తీర్చలేదని కక్షకట్టి ఉద్యోగం నుంచి తొలగించారు...
, బుధవారం, 25 అక్టోబరు 2017 (11:11 IST)
ఆమె అనాథ. కడుపేదరికం కారణంగా వివాహం చేసుకోలేదు. చిన్న ఉద్యోగం చేసుకుంటూ పొట్టపోసుకుంటోంది. ఆమెపై ఎటువంటి అవినీతి ఆరోపణలు లేవు.. అయినా ఆ నిరుపేదరాలిపై కక్షగట్టారు. కారణం.. ఓ కామాంధుడి కోర్కె తీర్చలేదని. ఫలితంగా ఆమె ఉన్న ఉపాధి కోల్పోయి రోడ్డు పడింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే...
 
విజయనగరం జిల్లా జామి మండలం, లొట్లపల్లి గ్రామానికి చెందిన ఆమె పేరు జన్నెల వాణిశ్రీ. నిరుపేద కుటుంబం. తల్లిదండ్రులు వ్యవసాయ కూలీలు. ఐదుగురు ఆడపిల్లల్లో వాణిశ్రీ చిన్నమ్మాయి. ఇంటర్‌ వరకు చదివిన వాణిశ్రీ నాలుగేళ్ల పాటు కూలి పనులకెళ్లారు. 2006లో ఉపాధి హామీ పథకం రావడంతో ఫీల్డ్‌ అసిస్టెంట్‌గా ఉద్యోగంలో చేరారు. అప్పటి నుంచీ మరో వ్యాపకం లేకుండా విధులకు అంకితమయ్యారు. 2008–09 సంవత్సరాల్లో తల్లిదండ్రులు కాలం చేశారు. ఒకప్పుడు కట్నం ఇవ్వలేక తల్లిదండ్రులు ఆమెకు పెళ్లి చేయలేకపోయారు. 
 
ఈ నేపథ్యంలో పైఅధికారి కన్ను ఆమెపై పడింది. అతని మనసులోని మాటను బహిర్గతం చేశాడు. డబ్బు ఆశచూపాడు. అయినా ఆ యువతి లొంగలేదు. అదే ఆమె చేసిన నేరమన్నట్లు ఆమెకు వేధింపులు మొదలయ్యాయి. ఉన్నవి, లేనివి కల్పించారు. రికార్డులు తారుమారు చేసి ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి ఆమెను విధులకు రావొద్దన్నారు. ఆపై ఈ నెల 16వ తేదీన ఉద్యోగంలోంచి తొలగించారు. ఉద్యోగం కావాలంటే కోరిక తీర్చాలి లేదా.. రూ.30 వేలైనా ఇవ్వాలని పైఅధికారి చేసిన ప్రతిపాదన విని ఆమె కన్నీరు మున్నీరయ్యారు. న్యాయం కోసం డ్వామా పీడీకి, జిల్లా కలెక్టర్‌ను ఆశ్రయించింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భరతమాతకు పూజలతో జనసేన ఆఫీసు ప్రారంభం.. (Video)