Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

సిఎం రమేష్ ఎనర్జీ టాబ్లెట్లు వేసుకుంటున్నారు... రోజా సంచలన వ్యాఖ్యలు

మరోసారి తెలుగుదేశంపార్టీపై విరుచుకుపడ్డారు వైసిపి ఎమ్మెల్యే రోజా. కడప ఉక్కు - ఆంధ్రుల హక్కు పేరుతో తెలుగుదేశం చేస్తున్న దీక్ష అంతా బూటకమని కొట్టి పారేశారు రోజా. తొమ్మిది రోజులు కాదు సంవత్సరం పాటు ఎంపి సి.ఎం. రమేష్‌ దీక్ష చేసినా ఏమీ కాదని, ఆయన చనిపోయే

సిఎం రమేష్ ఎనర్జీ టాబ్లెట్లు వేసుకుంటున్నారు... రోజా సంచలన వ్యాఖ్యలు
, శుక్రవారం, 29 జూన్ 2018 (16:59 IST)
మరోసారి తెలుగుదేశంపార్టీపై విరుచుకుపడ్డారు వైసిపి ఎమ్మెల్యే రోజా. కడప ఉక్కు - ఆంధ్రుల హక్కు పేరుతో తెలుగుదేశం చేస్తున్న దీక్ష అంతా బూటకమని కొట్టి పారేశారు రోజా. తొమ్మిది రోజులు కాదు సంవత్సరం పాటు ఎంపి సి.ఎం. రమేష్‌ దీక్ష చేసినా ఏమీ కాదని, ఆయన చనిపోయే అవకాశమే లేదన్నారు రోజా. విదేశాల నుంచి వేల రూపాయలు వెచ్చించి ఎనర్జీ ట్యాబ్లెట్లను సిఎం రమేష్‌ కొనుక్కుని వచ్చి వేసుకుంటున్నాడని అన్నారు. 
 
రాత్రయితే ఆ ట్యాబ్లెట్లు వేసుకుని పడుకుంటున్నాడని, సిఎం... రమేష్‌ అనారోగ్యం క్షీణిస్తోందని జరుగుతున్న ప్రచారంలో అసలు నిజమే లేదన్నారు రోజా. తొమ్మిదిరోజుల పాటు దీక్ష చేస్తే మనిషి పూర్తిగా నీరసించిపోతాడని, కానీ సి.ఎం.రమేష్‌ విషయంలో మాత్రం అలా జరగలేదని చెప్పారామె.
 
కేంద్రంపై పోరాడేందుకు అందరినీ కలుపుకుని పోవాలే తప్ప, ప్రజలను మభ్యపెట్టేందుకు ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం ఏమిటని ప్రశ్నించారు. ఉక్కు పరిశ్రమ ఏర్పాటు కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆందోళన కొనసాగిస్తుందన్నారు ఎమ్మెల్యే రోజా.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

165 రోజులు విదేశాల్లోనే.. ప్రధాని మోడీ ఫారిన్ టూర్ల ఖర్చు రూ.355 కోట్లు