Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ప్రతిరోజూ కొత్తిమీర కషాయం తాగితే..?

ప్రతిరోజూ కొత్తిమీర కషాయం తాగితే..?
, మంగళవారం, 19 ఫిబ్రవరి 2019 (09:53 IST)
కషాయం అనగానే ఏదో కపాలానికి తాకినట్లే అనిపిస్తుంది. మరి ఆరోగ్యంగా ఉండాలంటే.. తగిన ఔషధ కషాయం తాగాల్సిందేనని చెప్తున్నారు ఆయుర్వేద నిపుణులు. కొన్నిరకాల మూలికల్ని చూర్ణాలుగా చేస్తేనే మేలు. మరి కొన్నింటిని మాత్రం కషాయమే చేయాలి. ప్రయోజనాలు అనేవి మూలికల మూలకాల మీదే కాదు. కషాయాల తయారీ పైన కూడా ఆధారపడి ఉంటాయి. మూలికల ప్రత్యేకతలు, వివిధ ప్రయోజనాల ఆధారంగా కషాయాలు తయారు చేసుకోవాలి. 
 
కొందరైతే చిన్న వయస్సులోనే కిడ్నీ సమస్యలతో బాధపడుతుంటారు. అలాంటి వారికి ఆయుర్వేదం ప్రకారం తయారుచేసే కషాయం తాగితే మంచిదంటున్నారు నిపుణులు. మరి ఆ కషాయం ఎలా చేయాలో ఓసారి తెలుసుకుందాం...
 
కావలసిన పదార్థాలు:
కొత్తిమీర - గుప్పెడు
నీరు - 1 గ్లాస్
 
తయారీ విధానం:
ముందుగా నీటిలో కొత్తిమీర వేసి బాగా మరిగించుకోవాలి. ఆపై చల్లార్చుకోవాలి. ఈ కషాయాన్ని రోజుకు రెండు పూటలా తాగాలి. ఇలా వరుసగా 40 రోజుల పాటు వాడి.. ఆపై 10 రోజులు మానేసి మళ్లీ తాగడం మొదలు పెట్టాలి. ఇలా చేయడం వలన పలురకాల కిడ్నీ సమస్యలు తగ్గుతాయి. కొత్తిమీర కషాయం కిడ్నీ సమస్యలకు ఎంతో దోహదం చేస్తుంది.
 
కిడ్నీలకు సంబంధించి సాధారణంగా యూరినోబ్లాడర్ సమస్యలు, కిడ్నీ దెబ్బ తిన్నప్పుడు క్రియాటిన్ లెవల్ పెరగడం, కిడ్నీ పనితీరు తగ్గడం వంటి సమస్యలు తలెత్తుతాయి. వీటన్నింటి నుండి ఉపశమనం పొందాలంటే.. కొత్తిమీర కషాయం తీసుకోవాలి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శృంగారం చేస్తుంటే నా భార్యకు బీపీ పెరుగుతోంది... కాళ్లూ-చేతులు చల్లబడుతున్నాయి...