Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఆ చెట్టు వేర్లను, బెరడును నలగ్గొట్టి నీటిలో వేడిచేసి వడగట్టి పురుషులు తీసుకుంటే?

చిట్టాముట్టి వేరును నూరుకుని ఆ మిశ్రమంలో ఆవుపాలు, నువ్వుల నూనె కలుపుకుని బాగా మరిగించుకోవాలి. కాసేపటి తరువాత పాలతో ముందుగా తయారుచేసుకున్న కషాయాన్ని కలుపుకుని ప్రతిరోజూ తీసుకుంటే కీళ్ల నొప్పులు, సయాటిక

ఆ చెట్టు వేర్లను, బెరడును నలగ్గొట్టి నీటిలో వేడిచేసి వడగట్టి పురుషులు తీసుకుంటే?
, గురువారం, 6 సెప్టెంబరు 2018 (16:58 IST)
చిట్టాముట్టి వేరును నూరుకుని ఆ మిశ్రమంలో ఆవుపాలు, నువ్వుల నూనె కలుపుకుని బాగా మరిగించుకోవాలి. కాసేపటి తరువాత పాలతో ముందుగా తయారుచేసుకున్న కషాయాన్ని కలుపుకుని ప్రతిరోజూ తీసుకుంటే కీళ్ల నొప్పులు, సయాటికా సమస్యలు, గౌట్ నొప్పులు తొలగిపోతాయి. చిట్టాముట్టి వేరు చూర్ణాన్ని తేనెలో కలిపి ఆ మిశ్రమాన్ని పాలలో కలుపుకుని తీసుకుంటే స్త్రీలకు చాలా మంచిది.
 
చిట్టాముట్టి వేరు పేస్ట్‌లో కప్పు పాలు, నీరు కలుపుకుని బాగా మరిగించుకుని చక్కెర వేసుకుని తాగితే గర్భస్రావం కాదు. చిట్టాముట్టి వేర్లను, బెరడును నలగ్గొట్టి పావు లీటర్ నీళ్లలో వేసుకుని బాగా మరిగించి వడబోసి అందులో కొద్దిగా చక్కెర కలుపుకుని రోజూ తీసుకుంటే వీర్యం చిక్కబడుతుంది. 
 
చిట్టాముట్టి వేర్లు, పల్లేరు వేర్లు సమానంగా నీళ్లలో కలుపుకుని కాచి చేసిన కషాయాన్ని 30 నుంచి 50 మి.లీ. మోతాదులో రోజుకు రెండు పూటలా సేవిస్తే అర్శమొలలు తగ్గుతాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కడుపులో నులిపురుగులు తొలగిపోయేందుకు ఇది తీసుకుంటే?