Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మిరియాల పొడి, టమోటాతో గొంతునొప్పి..?

మిరియాల పొడి, టమోటాతో గొంతునొప్పి..?
, గురువారం, 25 అక్టోబరు 2018 (14:36 IST)
ప్రతి వంటిట్లో మిరియాల, మిరియాల పొడి తప్పనిసరిగా ఉంటుంది. వీటిని మనం తయారుచేసే కూరలలో వేసుకుంటే చాలా రుచిగా, కమ్మగా ఉంటుంది. ఇవి అనారోగ్య సమస్యల నుండి కాపాడుతాయి. మిరియాలలోని ఆరోగ్య ప్రయోజనాలను తెలుసుకుంటే వీటిని అసలు విడిచి పెట్టరు. శరీరంలోని కొవ్వును తగ్గించాలనుకునే వారు మిరియాలను వేయించి పొడిచేసుకుని నీటిలో మరిగించి తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.
  
 
గొంతునొప్పిగా ఉన్నప్పుడు పాలలో కొద్దిగా మిరియాల పొడి, తేనె, చిటికెడు పసుపు కలిపి తీసుకుంటే వెంటనే ఉపశమనం లభిస్తుంది. మిరియాలలోని విటమిన్స్, క్యాల్షియం, ఐరన్, పాస్పరస్ వంటి పదార్థాలు దగ్గు, జలుబు వంటి సమస్యలను తొలగిస్తాయి. మిరియాల పొడిలో కొద్దిగా శొంఠి పొడి, తేనె కలుపుకుని రోజుకు రెండుసార్లు సేవిస్తే దగ్గు, జలుబుల తగ్గుతుంది. 
 
ఒక గిన్నెలో నీరుపోసి ఈ నీటిలో మిరియాల పొడి, ఉప్పు, ఇంగువ, పసుపు వేసి బాగా మరిగించుకోవాలి. ఈ మిశ్రమాన్ని ప్రతిరోజూ ఉదయాన్నే తీసుకుంటే దంతాలు ఆరోగ్యంగా ఉంటాయని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. అలాకాకుంటే బాణలిలో నూనెను వేసుకుని వేడయ్యాక టమోటా ముక్కలు, కొత్తిమీర, కరివేపాకు, అల్లం, వెల్లుల్లి పేస్ట్, జీలకర్ర, ఆవాలు, ఉల్లిపాయలు వేసి బాగా వేయించి నీరుపోసి కాసేపటి తరువాత మిరియాల పొడి వేసి బాగా కలిపి మరికాసేపు ఉడికించుకోవాలి. ఈ మిశ్రమాన్ని వేడివేడి అన్నంలో కలుపుకుని తీసుకుంటే బాగుంటుంది. జలుబు వెంటనే తగ్గుతుంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బ్రౌన్‌రైస్, చికెన్ వారానికి ఓసారి తీసుకుంటే..?