Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఉసిరికాయలను తిన్న వెంటనే నీరు తాగితే ఏమవుతుంది?

ఉసిరికాయలను తిన్న వెంటనే నీరు తాగితే ఏమవుతుంది?
, శుక్రవారం, 14 డిశెంబరు 2018 (10:08 IST)
చాలామందికి బానపొట్ట ఉంటుంది. దీని కారణంగా అందాన్ని, ఆరోగ్యాన్ని కోల్పోతున్నారని బాధపడుతుంటారు. పదిమందిలో తిరగాలంటే అవమానంగా ఉంటుంది. ఈ బానపొట్టను తగ్గించదానికి ఎన్ని ప్రయత్నాలు చేసిన లాభాలు కనిపించడంలేదని బాధ పడుతుంటారు. వాటన్నింటిని పక్కన పెట్టి కింది చెప్పబడిన చిట్కాలు పాటిస్తే.. బానపొట్ట తగ్గించుకోవచ్చు. మరి అందుకు ఏం చేయాలో తెలుసుకుందాం.
 
1. కప్పు జీలకర్రను నీటిలో వేసి బాగా మరిగించుకోవాలి. ఆ తరువాత అందులో కొద్దిగా బెల్లం కలిపి మరికాసేపు మరిగించి కషాయంలా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని గ్లాస్ మోతాదులో రోజూ తీసుకుంటే జీర్ణశక్తి పెరుగుతుంది. పొట్ట దగ్గరి కొవ్వు కూడా తగ్గుముఖం పడుతుంది. 
 
2. జీలకర్రను నూనెలో వేయించుకుని మెత్తని పేస్ట్‌లా తయారుచేసుకోవాలి. ఇలా చేసిన మిశ్రమాన్ని గోరువెచ్చని పాలలో కలిపి స్పూన్ తేనె కలిపి తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అనారోగ్యాలు కూడా దరిచేరవు. 
 
3. ఉసిరికాయలు ఈ సీజల్‌లో ఎక్కువగా లభిస్తాయి. వీటిని సేవిస్తే అధిక బరువు తగ్గుతారు. దాంతో పొట్ట దగ్గరి కొవ్వు కూడా తగ్గుతుంది. అలానే ప్రతిరోజూ ఉదయాన్నే ఉసిరికాయ రసాన్ని తాగితే ఫలితం ఉంటుంది. 
 
4. ఉసిరికాయలను చిన్నచిన్న ముక్కలుగా కట్ చేసుకుని అందులో కొద్దిగా ఉప్పు, కారం కలిపి సేవిస్తే.. రుచి బాగుంటుంది. నోటికి పుల్లగా, కారంగా ఎంతో రుచిగా ఉంటుంది. ఈ ఉసిరికాయను తిన్న తరువాత నీటిని వెంటనే తాగరాదు.. అలా తాగితే గొంతు పట్టుకుంటుంది. దాంతో గుండె సంబంధిత సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి. కనుక ఓ 10 లేదా 15 నిమిషాల తరువాత నీరు తీసుకోవాలి. 
 
5. మెంతులు ఆకలిని పెంచుతాయి. రాత్రి నిద్రకు ముందుగా కప్పు మెంతులను నీటిలో నానబెట్టుకోవాలి. ఆ తరువాత ఉదయాన్నే ఆ నీటిని తీసుకుంటే పొట్ట దగ్గరి కొవ్వు త్వరగా కరిగిపోతుంది. శరీరా ఆరోగ్యానికి మంచి ఔషధంగా, టానిక్‌లా పనిచేస్తుంది.   

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఎండు అత్తి పండ్లను రాత్రంతా నానబెట్టి ఉదయం తీసుకుంటే?