Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మధుమేహానికి దివ్యౌషధం.. త్రిఫలా చూర్ణాన్ని నెయ్యి, మజ్జిగలో కలిపి తాగితే..?

triphala
, బుధవారం, 12 జులై 2023 (20:08 IST)
దేశంలో మధుమేహం బారిన పడేవారు రోజురోజుకీ పెరిగిపోతున్నారు. ఆహారంతో పాటు ఆయుర్వేద చిట్కాలు పాటిస్తే.. మధుమేహాన్ని దూరం చేసుకోవచ్చునని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. త్రిఫలా చూర్ణంతో మధుమేహాన్ని అదుపులో వుంచుకోవచ్చు. 
 
త్రిఫల చూర్ణంతో కలిగే ప్రయోజనాలను చూద్దాం.. ఉసిరి కాయ, కరక్కాయ, తానికాయల మిశ్రమాన్ని త్రిఫల అంటారు. ఇది మధుమేహానికి అద్భుతమైన ఔషధం. అలాగే, అధిక రక్తపోటు, ఊబకాయం, కీళ్ల నొప్పులను నివారిస్తుంది. ఉసిరి కాయ, కరక్కాయ, తానికాయలతో శరీరానికి అవసరమైన పోషకాలు ఉంటాయి.
 
కాబట్టి ప్రతి ఒక్కరూ దీనిని ఉపయోగించవచ్చు. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. త్రిఫల ప్యాంక్రియాస్ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచుతుంది. త్రిఫలాన్ని స్వచ్ఛమైన నెయ్యితో కలుపుకోవచ్చు. ఇది ప్రేగులు, ప్రేగుల గోడలను శుభ్రపరుస్తుంది. 
 
ఇది శరీరంలోని విషాన్ని తొలగించడంలో సాయపడుతుంది. ఇది రక్త ప్రసరణను క్రమబద్ధీకరిస్తుంది. చక్కెర స్థాయిని నియంత్రిస్తుంది. త్రిఫల చూర్ణాన్ని మజ్జిగలో కలిపి తాగితే ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఇది జీవక్రియను మెరుగుపరుస్తుంది. జీర్ణక్రియ కూడా ఆరోగ్యంగా ఉంటుంది. 
 
మధుమేహ వ్యాధిగ్రస్తులు మధ్యాహ్న భోజనం తర్వాత ఒక టీస్పూన్ త్రిఫలాన్ని ఒక కప్పు మజ్జిగలో కలిపి తాగవచ్చు. రాత్రిపూట ఒక టీస్పూన్ త్రిఫలాన్ని ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో కలిపి తాగడం మధుమేహ వ్యాధిగ్రస్తులకు చాలా మేలు చేస్తుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

దాల్చిన చెక్క స్త్రీలకు ఎలా ఉపయోగపడుతుంది?