Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పాలు, ఉప్పుతో చేతులు మృదువుగా.. ఎలా..?

పాలు, ఉప్పుతో చేతులు మృదువుగా.. ఎలా..?
, సోమవారం, 12 నవంబరు 2018 (15:09 IST)
సాధారణంగా చాలామంది మహిళలు రకరకాల క్రీములు వాడి ముఖాన్ని పాడుచేసుకుంటున్నారు. ఈ క్రీమ్స్‌లోని రసాయనాలు చర్మాన్ని ముడతలుగా మార్చుతాయి. దాంతో చిన్న వయసు గలవారు కూడా ముడతల చర్మానికి గురౌతారు. మరి అందుకు ఏం చేయాలో చూద్దాం... పాలు ఆరోగ్యానికి ఎలా ఉపయోగపడుతాయనే విషయం అందరికి తెలిసిందే. మరి అందానికి ఎలా..
 
పాలను చర్మంపై పూర్తిగా రాయాలి. గంట తరువాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. దీంతో చర్మం కాంతివంతంగా మారుతుంది. అలానే చర్మం ఎంత అందంగా ఉంటుందో గోర్లు కూడా అంతే అందంగా ఉండాలి. కాబట్టి పాలలో దూదిని గోర్లను శుభ్రం చేయాలి. తద్వారా గోర్లు అందంగా పటిష్టంగా ఉంటాయి. ఎక్కువగా పాత్రలు తోమే చేతులు గరుకుగా ఉంటాయి. ఇలాంటి సందర్భాల్లో చేతులు మృదువుగా మార్చాలంటే.. ఏం చేయాలి?
 
పాలలో కొద్దిగా నిమ్మరసం కలిపి చేతులపై పూతలా వేసుకోవాలి. ఇలా రోజూ చేస్తే చేతులు మృదువుగా మారుతాయి. అలానే కొందరికి పెదాలు నల్లగా ఉంటాయి. వాటిని గులాబీ రంగులే తేవాలంటే.. రోజూ పెదాలను పాలు రాసుకోండి.. మంచి ఉపశమనం లభిస్తుంది. మెుటిమలు చర్మం వలన ముఖంపై నల్ల నల్లగా మచ్చలు వస్తుంటాయి. వాటిని తొలగించాలంటే.. ఇలా చేయాలి...
 
పాలలో కొద్దిగా రోజ్ వాటర్ కలిపి ముఖానికి ప్యాక్ వేసుకోవాలి. లేదా పాలలో కొద్దిగా ఉప్పు కలిపి రోజూ ఉదయం, సాయంత్రం ముఖానికి పూతలా వేసుకోవాలి. ఇలా తరచుగా చేస్తే చర్మం కోమలంగా, తాజాగా మారుతుంది. అంతేకాకుండా బాదం పప్పులు, క్యారెట్ రసం, పాలు కలిపి జ్యూస్‌లా తయారుచేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని చర్మానికి రాసుకుంటే మెుటిమలు పోతాయి. దాంతో చర్మం సౌందర్యంతో ఇనుమడిస్తుంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అది అలా తీసుకుంటే శృంగార శక్తి... హాయిగా నిద్ర...