Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

బొప్పాయి గుజ్జు, ముల్తానీ మట్టితో ఫేస్‌ప్యాక్ వేసుకుంటే?

శెనగపిండిలో కొద్దిగా పసుపు కలుపుకుని ముఖానికి రాసుకోవాలి. 20 నిమిషాల తరువాత శుభ్రం చేసుకుంటే ముఖం ముడతులు తొలగిపోయి కాంతివంతంగా మారుతుంది. కొబ్బరినూనెను మెడకు, ముఖానికి రాసుకుని 15 నిమిషాల తరువాత శుభ్

బొప్పాయి గుజ్జు, ముల్తానీ మట్టితో ఫేస్‌ప్యాక్ వేసుకుంటే?
, శుక్రవారం, 21 సెప్టెంబరు 2018 (11:57 IST)
శెనగపిండిలో కొద్దిగా పసుపు కలుపుకుని ముఖానికి రాసుకోవాలి. 20 నిమిషాల తరువాత శుభ్రం చేసుకుంటే ముఖం ముడతులు తొలగిపోయి కాంతివంతంగా మారుతుంది. కొబ్బరినూనెను మెడకు, ముఖానికి రాసుకుని 15 నిమిషాల తరువాత శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి రెండుసార్లు చేయడం వలన ముఖం మృదువుగా మారుతుంది.
 
కలబంద గుజ్జులో పసుపు, తేనె, పాలు కలుపుకుని ముఖానికి రాసుకోవాలి. 20 నిమిషాల తరువాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వలన ముఖంపై గల మెుటిమలు, నల్లటి వలయాలు తొలగిపోతాయి. బేకింగ్ సోడాలో ఆలివ్ నూనె, తేనె కలుపుకుని ముఖానికి ప్యాక్‌లా వేసుకుని అరగంట తరువాత శుభ్రం చేసుకుంటే ముఖం తాజాగా మారుతుంది. 
 
నిమ్మరసంలో పంచదార కలుపుకుని ముఖానికి, మెడకు రాసుకోవాలి. 20 నిమిషాల తరువాత శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి రెండుసార్లు చేస్తే మంచి ఉపశమనం లభిస్తుంది. బొప్పాయి గుజ్జులో కొద్దిగా ముల్తానీ మట్టి, తేనె కలుపుకుని ముఖానికి రాసుకోవాలి. అరగంట తరువాత చల్లని నీటితో శుభ్రం చేసుకుంటే మెుటిమలు తొలగిపోతాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వర్షాకాలంలో గ్రిల్డ్ చికెన్ తీసుకుంటే?