Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కంటి కిందటి నల్లటి చారలు పోవాలంటే.. ఇలా చేయాలి..?

కంటి కిందటి నల్లటి చారలు పోవాలంటే.. ఇలా చేయాలి..?
, సోమవారం, 10 డిశెంబరు 2018 (14:37 IST)
పండగ హడావుడి.. ఇంటి అలంకరణ పనులతో, ఇంటికొచ్చిన అతిథులకు వండివార్చే పనిలో తీవ్రమైన అలసటతో ఉంటారు. కాబట్టి అప్పటికప్పుడు చిన్నపాటి చిట్కాలు పాటిస్తే చాలు మళ్ళీ మీరు ఉత్సాహాన్ని పొందుతారు. ప్రతి రోజూ ముఖం శుభ్రంగా కడుక్కున్న తరువాత ఓ నాలుగు బొప్పాయి పండు ముక్కలతో ముఖంపై రుద్దితే నిర్జీవంగా ఉన్న చర్మం కాంతివంతంగా అవుతుంది.
 
అవిసెనూనెలో తగినంత నిమ్మరసం కలిపి జుట్టుకు రాసి మర్నాడు తలస్నానం చేస్తే శిరోజాలు మృదువుగా మారుతాయి. శిరోజాలకు నూనె రాసి అరగంటాగి.. అప్పుడు కండీషనర్ కలిసిన షాంపూతో తలస్నానం చెయ్యాలి. ఇలా చేస్తే శిరోజాలు అందంగా మెరిసిపోతాయి. స్పూన్ ముల్తానీ మట్టి, స్పూన్ మీగడ, అరస్పూన్ తేనె, పావు స్పూన్ బాదం నూనెను పేస్ట్‌లా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి ప్యాక్‌లా వేసుకోవాలి. 20 నిమిషాల తరువాత చల్లని నీటితో శుభ్రపరుచుకోవాలి. ఇలా రోజూ చర్మం పొడిబారకుండా, కాంతివంతంగా తయారవుతుంది.
 
గులాబీ నీళ్లలో దూదిని నానబెట్టి కళ్ల కింద అప్పుడప్పుడూ తుడుస్తూ ఉంటే నల్లమచ్చలు క్రమంగా తగ్గిపోతాయి. పలుచగా తరిగిన బంగాళాదుంప చక్రాలను కానీ, నిమ్మరసంలో ముంచిన కీరదోస ముక్కలని కానీ కళ్లపై ఉంచి 3 నిమిషాల తర్వాత తీసేసినట్లైతే కళ్లమంటలు తగ్గి మనసుకు హాయిగా ఉంటుంది. కళ్లలో అలసట ఛాయలు, నల్ల చారలు ఉన్ననట్లైతే కొద్దిగా కన్సీలర్ రాసి, ఆపై లేత వర్ణంలో ఉన్న పసిడి వర్ణపు ఐ షాడోను వేసుకొంటే కళ్లు చూడచక్కగా అందంగా కనిపిస్తుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఉల్లి తీసుకుంటే.. కలిగే లాభాలివే..?