Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పాదాలు మృదువుగా కనిపించాలా... కాస్త ఉప్పు, నిమ్మరసం...

పాదాలు మృదువుగా ఉండాలంటే రాత్రివేళ నిద్రకు ఉపక్రమించేందుకు ముందుగా వేడినీటితో కాస్త ఉప్పు, నిమ్మరసం, షాంపు వేసి 5 లేదా 10 నిమిషాల పాటు పాదలను నానబెట్టాలి. ఇలా వారానికి రెండు లేదా మూడు రోజులు చేయాలి. ఆ

పాదాలు మృదువుగా కనిపించాలా... కాస్త ఉప్పు, నిమ్మరసం...
, మంగళవారం, 12 జూన్ 2018 (12:04 IST)
పాదాలు మృదువుగా ఉండాలంటే రాత్రివేళ నిద్రకు ఉపక్రమించేందుకు ముందుగా వేడినీటితో కాస్త ఉప్పు, నిమ్మరసం, షాంపు వేసి 5 లేదా 10 నిమిషాల పాటు పాదలను నానబెట్టాలి. ఇలా వారానికి రెండు లేదా మూడు రోజులు చేయాలి. ఆ తరువాత పాదాలను పొడిబట్టతో తుడిచి వేడిచేసిన నువ్వుల నూనెను రాసుకుంటే పాదాలు మృదువుగా తయారవుతాయి.
 
గోధుమ పిండిలో కొద్దిగా వెన్నను కలిపి మెడకు రాసుకుని 20 నిమిషాల తరువాత కడుక్కుంటే మెడభాగంలో ఉండే నల్లటి వలయాలు తొలగిపోయి మెడ అందంగా కనిపిస్తుంది. కంటి కిందటి నల్లటి వలయాలు తొలగిపోవాలంటే కీరదోస, బంగాళాదుంప సమానంగా తీసుకుని పేస్టులా తయారుచేసుకోవాలి. ఆ మిశ్రమాన్ని ముఖానికి రాసుకుని 10 నిమిషాల తరువాత గోరువెచ్చని నీటితో కడిగితే చర్మం కోమలంగా మారుతుంది.
 
తేలికగా ఉండే ఒక తెలుపు రంగు కాటన్‌ను పన్నీరులో ముంచి దాన్ని కంటిపై పెట్టుకోవాలి. దానిపై రుబ్బిన బంగాళాదుంప, కీరదోస పేస్ట్‌ను రాసుకోవాలి. 15 నిమిషాల తరువాత చల్లటి నీటితో కడుక్కుంటే ముఖం కాంతివంతంగా మారుతుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సోయాబీన్‌ను పచ్చిపాలలో కలిపి మూఖానికి పట్టిస్తే?