Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

వీపువై మెుటిమలు తొలగిపోవడానికి? తేనెను రాసుకుంటే?

కొంతమందికి వీపు మీద చిన్న చిన్న మెుటిమలు లేదంటే దద్దుర్లు లాంటివి వస్తుంటాయి. దానికి పరిష్కారంగా ఈ చిట్కాలు పాటిస్తే మంచి ఫలితాలను పొందవచ్చును. మనం సరైన ఆహారం తీసుకోకపోవడం కూడా దీనికి కొన్నిసార్లు కార

వీపువై మెుటిమలు తొలగిపోవడానికి? తేనెను రాసుకుంటే?
, శనివారం, 14 జులై 2018 (13:45 IST)
కొంతమందికి వీపు మీద చిన్న చిన్న మెుటిమలు లేదంటే దద్దుర్లు లాంటివి వస్తుంటాయి. దానికి పరిష్కారంగా ఈ చిట్కాలు పాటిస్తే మంచి ఫలితాలను పొందవచ్చును. మనం సరైన ఆహారం తీసుకోకపోవడం కూడా దీనికి కొన్నిసార్లు కారణం కావొచ్చు. శరీరంలో వచ్చే మార్పులకు మన చర్మం తొందరగా స్పందిస్తుంది. అలాంటి మార్పు వస్తే వెంటనే గమనించాలి.
 
చిరుతిళ్లు ఎక్కువగా తింటున్నట్లైతే మానేసి తాజా కూరగాయలు, మాంసకృతులు ఉండే ఆహారం అధికంగా తీసుకుంటే మంచిది. కదలకుండా ఎక్కువసేపు కూర్చోవడం వలన వీపును అలా కుర్చీకి ఆనించి ఉంచుతాం. ఇది కూడా ఒక కారణం కావొచ్చు. అందుకే పని మధ్యలో అప్పుడప్పుడు తప్పనిసరిగా విరామం ఉండేలా చూసుకోవాలి.
 
సాయంత్రం వ్యాయామం చేసిన తరువాత స్నానం మానకూడదు. లేదంటే చెమట వలన కూడా ఈ సమస్య పెరిగి అవకాశం ఉంది. చర్మ రంధ్రాలు మూసుకుపోయి ఇంకా ఎక్కువయ్యే ప్రమాదం ఉంటుంది. జుట్టు ఎక్కువుగా వీపు భాగానికి తగలడం వలన కూడా ఈ సమస్య ఎక్కువవుతుంది. పొడవు జుట్టు ఉన్నవాళ్లు జుట్టు ముందు వైపునకు వేసుకుంటే మంచిది.
 
కొబ్బరినూనెలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్‌ లక్షణాలు మొటిమల్ని తగ్గిస్తాయి. రాత్రి పడుకునే ముందు చిన్న దూది ఉండను కొబ్బరినూనెలో ముంచి రాసుకోవాలి. ఉదయాన్నే కడిగేస్తే చాలు. ఇలా తరచూ చేస్తే మంచి ఫలితాలను పొందవచ్చును. తేనె కూడా దీనికి మంచి పరిష్కారం. తేనెను ఆ భాగంలో రాసుకుని అరగంట తరువాత చల్లని నీళ్లతో శుభ్రం చేసుకోవాలి. దీనిలో ఉండే సహజగుణాలు సమస్య తగ్గుముఖం పట్టేలా చేస్తాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బాదం ఆకులతో.. చర్మ సమస్యలు మటాష్