Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మీగడ, తేనెతో ప్యాక్ వేసుకుంటే..?

మీగడ, తేనెతో ప్యాక్ వేసుకుంటే..?
, సోమవారం, 5 నవంబరు 2018 (11:57 IST)
చిన్న వయస్సులోనే చాలామందికి ముఖం ముడతలుగా మారుతుంది. ఎందుకంటే.. ఎక్కువగా మేకప్ వేసుకుంటే కూడా చర్మం ముడతలుగా మారుతుంది. సాధారణంగా కొందరైతే మేకప్ వేసుకుంటే అందంగా కనిపిస్తారని ఎక్కడికి వెళ్లినా మేకప్ వేసుకునే వెళ్తారు. కానీ, ఇప్పుడు ఆ మేకప్ అందాన్ని కోల్పోలా చేసింది.. మరే ఏం చేయాలంటూ.. సతమతమవుతుంటారు. చర్మం అందంగా ఉండాలంటే.. ఈ చిట్కాలు పాటిస్తే మంచి ఫలితాలు లభిస్తాయని బ్యూటీషన్స్ చెప్తున్నారు. అవేంటే చూద్దాం..
 
మీగడలలో కొద్దిగా తేనె, చక్కెర కలిపి ముఖానికి రాసుకోవాలి. అరగంట తరువాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా ప్రతిరోజూ క్రమంగా చేస్తే.. ముడతల చర్మం తొలగిపోయి ముఖం మృదువుగా మారుతుంది. నిమ్మకాయలోని యాంటీ ఆక్సిడెంట్స్ చర్మాన్ని తాజాగా మార్చుతుంది. ఎలా అంటే.. నిమ్మ తొక్కలను పొడిచేసి అందులో కొద్దిగా పెరుగు, కొబ్బరి నూనె కలిపి ముఖానికి, మెడదు రాసుకోవాలి. 
 
గంట తరువాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేస్తే చర్మంపై నల్లటి మచ్చలు తొలగిపోయి కాంతివంతంగా మారుతుంది. అలానే కాఫీ పొడిలో కొద్దిగా గోరింటాకు పొడి, వంటసోడా కలిపి ముఖానికి రాసుకోవాలి. అరగంట తరువాత నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేస్తే ముఖం తాజాగా మారుతుంది. దాంతో పాటు మెుటిమలు కూడా తొలగిపోతాయి. 
 
ఆలివ్ నూనె ఆరోగ్యానికి చాలా మంచిది. మరి అందానికి ఎలా ఉపయోగపడుతుందో చూద్దాం.. ఆలివ్ నూనెలో కొద్దిగా మెంతి పొడి, క్యారెట్ రసం, కలబంద గుజ్జు కలిపి ముఖానికి ప్యాక్ వేసుకోవాలి. 20 నిమిషాల తరువాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకుంటే ముడతలు చర్మం పోతుంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

టేస్టీ టేస్టీ చికెన్ కటీ రోల్ ఎలా చేయాలో తెలుసా..?