Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రోజూ రెండుపూటలా స్నానం చేస్తే సరిపోదు... మరింకేం చేయాలి?

రోజూ రెండుపూటలా స్నానం చేస్తే సరిపోదు... మరింకేం చేయాలి?
, బుధవారం, 21 నవంబరు 2018 (21:02 IST)
ప్రతిరోజు రెండు పూటలా స్నానం, ముఖానికి సబ్బు, చర్మం కాంతివంతంగా ఉండడానికి ఓ మాయిశ్చరైజర్... ఈ జాగ్రత్తలు తీసుకుంటే చాలనుకుంటారు చాలామంది మహిళలు. అయితే వీటితో పాటు చర్మ సంరక్షణలో భాగంగా ముఖ్యమైనది మృత కణాలను తొలగించుకోవడం. వీటిని ఎప్పటికప్పుడు తొలగించుకోకపోతే చర్మం నిర్జీవంగా మారి కళ తప్పి పొడిబారినట్లవుతుంది. మరి వీటిని సహజమైన పదార్దాలను ఉపయోగించి ఎలా తొలగించుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
 
1. వేపాకుల్ని ముద్దలాగా చేసి కాస్త పెసరపిండి , చెంచా ఆలివ్ ఆయిల్ కలిపి ముఖానికి రాసుకుని మృదువుగా రుద్దాలి.  ఇలా చేయడం వల్ల నల్ల మచ్చలు, మృత కణాలు తొలగిపోయి చర్మం నునుపుగా తయారవుతుంది.
 
2. ఒక చెంచా కొబ్బరి నూనె, ఒక చెంచా ఆలివ్ నూనె బాగా కలిపి ఇందులో మూడు చెంచాల చక్కెర కలిపి ముఖానికి మిగతా శరీరానికి రాసి కొన్ని నిముషాల పాటు మృదువుగా మర్దనా చేయాలి. పది నిముషాలు ఆగి గోరువెచ్చని నీళ్లతో కడిగేయాలి. చక్కెర చర్మంపై పేరుకున్న మృతకణాలను తొలగిస్తుంది.
 
3. కొబ్బరినూనె  చర్మానికి కావలసిన తేమను, పోషణను అందిస్తుంది.
 
4. ఒక టీ స్పూన్ టమోటా రసంలో కొద్దిగా గుడ్డులోని తెల్లసొన, అర టీ స్పూన్ బ్రూ పొడిని కలిపి ఫేస్టులా చేసి దానిని ముఖానికి పట్టించాలి. 15 నిమిషముల తర్వాత చల్లటి నీటితో కడిగివేయాలి. ఇలా వారంలో రెండు రోజులు చేయడం వలన ముఖం పై ఉన్న ముడతలు తొలగిపోయి యవ్వనంగా కనిపిస్తారు. 
 
5. అరటిపండు ఆరోగ్యానికే కాకుండా మంచి సౌందర్య సాధనంగా కూడా ఉపయోగపడుతుంది. అరటిపండులో మాయిశ్చర్ అధికం. అరటిపండులో పొటాషియం, విటమిన్ సి, ఇ ఎక్కువుగా ఉంటాయి. అరటిపండుగుజ్జులో ఒక టేబుల్ స్పూన్ తేనె, అర టీస్పూన్ నిమ్మరసం కలిపి ముఖానికి పట్టించి గంట తర్వాత చల్లటి నీటితో కడుక్కోవాలి. దీని వలన ముఖంపై ఉన్న నల్లమచ్చలు తొలగి చర్మం సున్నితంగా తయారవుతుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మనమేమీ అడ్వాన్స్ కాలేదుగా... నన్ను మర్చిపో అంటోంది... ఏం చేయాలి?